News December 30, 2025

భువనగిరి: గ్రీవెన్స్‌ డే రద్దు

image

గురువారం జరగాల్సిన ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి రద్దయినట్లు కలెక్టర్ హనుమంతరావు వెల్లడించారు. నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వివిధ వర్గాల ప్రజలు, అధికారులు కలెక్టరేట్‌కు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. గురువారం ఫిర్యాదుల కోసం కార్యాలయానికి రావొద్దని ప్రజలను కోరారు. తదుపరి గ్రీవెన్స్ షెడ్యూల్‌ను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News February 6, 2026

INDతో మ్యాచును బాయ్‌కాట్ చేస్తే పాక్‌కే దెబ్బ!

image

T20 WCలో భారత్‌తో మ్యాచును బాయ్‌కాట్ చేస్తే పాకిస్థాన్‌కు గ్రూప్ స్టేజ్ దాటడమే కష్టంగా మారొచ్చు. ఈ మ్యాచ్ ఆడకపోతే గ్రూప్‌లోని మిగతా జట్లపై(USA, నమీబియా, నెదర్లాండ్స్) కచ్చితంగా గెలవాలి. లేదంటే NRRపై ఆధారపడాల్సి వస్తుంది. 2024 WCలో PAKను USA ఓడించింది. దీంతో ఈసారీ ఆ టీమ్ నుంచి పాక్‌కు ముప్పు ఉంది. ఈ నేపథ్యంలో INDతో మ్యాచ్ ఆడితేనే గెలుపు కోసం ప్రయత్నించేందుకు PAKకు మరో అవకాశం(మ్యాచ్) ఉంటుంది.

News February 6, 2026

ఆయిల్ ఫామ్.. టన్నుకు రూ.224 అదనం

image

AP: తెలంగాణా కంటే రాష్ట్రంలోని ఆయిల్ ఫామ్ రైతులకు టన్నుకు అదనంగా రూ.224 చెల్లిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2025-26 ఏడాదిలో 20.01% ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేషియో(ఓయూఆర్)ను ప్రభుత్వం ప్రకటించిందని.. దీని వల్ల టన్ను ఆయిల్ ఫామ్‌కు రూ.20,680 ధర లభించిందని తెలిపారు. తెలంగాణలో జనవరికి సంబంధించి పామాయిల్ రైతులకు టన్నుకి రూ.20,456 ధర వస్తే.. ఏపీలో అదనంగా రూ.224 లభించిందని పేర్కొన్నారు.

News February 6, 2026

హిందూపురంలో కానిస్టేబుల్‌పై కత్తితో దాడి

image

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రవిపై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఓ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై ఎరుకల కావిడి నాగేంద్ర తిరగబడినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన అత్త-కోడలు గ్యాంగ్ రేప్ కేసులో ఇతడే ప్రధాన నిందితుడు.