News August 20, 2025

భువనగిరి: చెరువులో స్నానానికి దిగి యువకుడి గల్లంతు

image

మర్యాలలోని కురుమనుకుంట చెరువులో పడి నందులాల్ (23) అనే ఉత్తరప్రదేశ్‌ యువకుడు గల్లంతయ్యాడు. పక్కనే ఉన్న క్రషర్ కంపెనీలో పనిచేసే నందులాల్ మంగళవారం ఉదయం స్నానం చేయడానికి చెరువులోకి దిగి ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీశైలం బృందం గాలింపు చర్యలు చేపట్టింది. రాత్రి వరకు వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం మళ్లీ గాలింపు చర్యలు ప్రారంభిస్తామని పోలీసులు తెలిపారు.

Similar News

News August 20, 2025

వాస్తు పేరుతో ఇంద్రకీలాద్రిలో కోట్లు స్వాహా?

image

విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్నాయి. సుమారు 2-3 లక్షల మంది వస్తారు. ప్రసాద భవనం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఓ ఇంజినీరింగ్ అధికారి, ఆలయ ఆస్థాన విధ్వాంసుడి నిర్వాకం వల్ల శాశ్వత భవనాలు నిర్మించలేదని ఆరోపణలున్నాయి. నిర్మాణాలు చేపట్టి వాస్తు దోషం పేరిట కూల్చివేయడం వల్ల కోట్లు దండుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

News August 20, 2025

HYD: ఇళ్లు అద్దెకు ఇచ్చే ముందు జాగ్రత్త: DCP

image

HYD నగర భవన యజమానులకు పోలీసులు పలు సూచనలు చేశారు. నివాస, వాణిజ్య భవనాలను నగరంలో రెంట్ కోసం ఇచ్చే ముందు యజమానులు నిబంధనలు పాటించాలని, అగ్రిమెంట్ చేసుకోవాలని సైబర్‌క్రైమ్ DCP శిల్పవల్లి తెలిపారు. ఖాళీ చేయించాల్సిన సమయంలో రెంటర్లకు నోటీసులు ఇవ్వాలని, కిరాయి సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకోవాలని సూచించారు.

News August 20, 2025

మలేరియాకు మూలాన్ని కనిపెట్టింది సికింద్రాబాద్‌లోనే

image

సికింద్రాబాద్‌ మిలిటరీ హాస్పిటల్లో పని చేసే బ్రిటిష్ వైద్యుడు సర్ రోనాల్డ్ రాస్ 1997 ఆగస్టు 20న మలేరియా వ్యాప్తికి దోమలే కారణమని నిరూపించారు. పరిశోధనతో ఆయనను 1902లో నోబెల్ అవార్డు వరించింది. దానికి గుర్తుగా ఈ రోజును ప్రపంచ దోమల దినోత్సవం జరుపుతారు. నేటికి ఈ ఆస్పత్రిలో డెంగ్యూ, మలేరియా వ్యాధులపై అవగాహన సదస్సులను నిర్వహిస్తూ చరిత్రను నెమరేసుకుంటున్నారు.