News February 24, 2025
భువనగిరి జిల్లా టాప్ న్యూస్

☞ తుర్కపల్లి డిప్యూటీ తహశీల్దార్ కల్పనకు కలెక్టర్ హనుమంతరావు మెమో జారీ ☞ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సెంటర్ల పరిశీలన ☞ భువనగిరికి వచ్చిన బీసీ కమిషన్ మెంబర్ బాలలక్ష్మీ ☞ సాగునీరు లేక ఎండిపోతున్న వరి పంటలు ☞ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్ హనుమంతరావు ☞ తుర్కపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు
Similar News
News February 25, 2025
కామారెడ్డి: వేములవాడకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

మహా శివరాత్రి పండగ సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజినల్ మేనేజర్ జ్యోష్నా సోమవారం తెలిపారు. 25, 26, 27 తేదీల్లో నిజామాబాద్ నుంచి వేములవాడకు పెద్దలకు రూ.270, పిల్లలకు రూ.150 టికెట్ ధరతో.. ఆర్మూర్ నుంచి రూ.220 పెద్దలకు, రూ.120 పిల్లలకు, కామారెడ్డి నుంచి పెద్దలకు రూ.140, పిల్లలకు రూ.80 టికెట్ ధర ఉంటుందన్నారు.
News February 25, 2025
NZB: ‘అధునాతన సదుపాయాలతో రెసిడెన్షియల్ పాఠశాలలు’

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అధునాతన వసతి, సదుపాయాలతో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలలను అందుబాటులోకి తేనున్నామని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణ వెల్లడించారు. సోమవారం ఆమె రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాలు, వసతుల కల్పన కోసం చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు.
News February 25, 2025
ఖమ్మం: సాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పెనుబల్లి మండలం టేకులపల్లిలో సోమవారం రైతులతో సమావేశమై సాగు నీటి విడుదల షెడ్యూల్పై ముందుగా సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. టెయిల్ ఎండ్ ప్రాంతాలకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గ్రామంలో తాగునీటి సరఫరా, విద్య, వైద్యం అంశాలను పరిశీలించారు. అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.