News March 13, 2025
భువనగిరి: ‘నీటి ఎద్దడికి తక్షణమే చర్యలు చేపట్టాలి’

భువనగిరి జిల్లాలో వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ గంగాధర్ ఆదేశించారు. సబ్కి యోజనా సబ్కా వికాస్లో భాగంగా జడ్పీ సీఈవో శోభారాణి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పంచాయితీ ప్లానింగ్ కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు. నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్న గ్రామాలను ముందస్తుగా గుర్తించి ప్రణాళికబద్ధంగా మిషన్ భగీరథ నీటిని అందించాలన్నారు.
Similar News
News March 13, 2025
సూపర్ ISRO: స్పేడెక్స్ అన్డాకింగ్ విజయవంతం

ఇస్రో అరుదైన ఘనత సాధించింది. ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసింది. <<15168341>>స్పేడెక్స్<<>> అన్డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది. కొన్ని నెలల క్రితం SDX-1, SDX-2 శాటిలైట్లను వేర్వేరుగా అంతరిక్షంలోకి పంపిన ఇస్రో వాటిని సమర్థంగా (డాక్) అనుసంధానించింది. ఇన్నాళ్లూ పనితీరును పరీక్షించి తాజాగా వాటిని విడదీసింది. దీంతో భవిష్యత్తు ప్రాజెక్టులైన స్పేస్ స్టేషన్, చంద్రయాన్ 4, గగన్యాన్కు మార్గం సుగమమైంది.
News March 13, 2025
VZM: పదో తరగతి పరీక్షలకు 2,248 మంది ఇన్విజిలేటర్లు

విజయనగరం జిల్లాలో ఈనెల 17 నుంచి 31 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నారు. 119 సెంటర్లలో 23,765 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారు. ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్స్ను ఏర్పాటు చేశారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధిస్తారు. జిరాక్స్, నెట్ సెంటర్లను మూసివేస్తారు. హాల్లోకి చీఫ్ సూపరింటెండెంట్ తప్ప ఎవరూ మొబైల్ తీసుకెళ్లకూడదు. రెండు విడతలగా 2,248 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తారు.
News March 13, 2025
పిఠాపురం రేపటి పవన్ ప్రసంగంపై సర్వత్రా అసక్తి..!

రేపు పిఠాపురం వేదికగా జరగనున్న జనసేన అవిర్భావ సభపై రాజకీయంగా భారీ అసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో 21 సీట్లలో విజయం సాధించడం డిప్యూటీ సీఎంగా మొదటిసారి జరుగుతున్న సభ కావడంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని కపాడాలనే నినాదంతో దేశవ్యాప్తంగా పవన్ చరిష్మా పెరిగింది. దీనితో రేపు ఆయన భవిష్యత్తు రాజకీయాలపై ఎలాంటి ప్రకటనలు చేస్తారని తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.