News September 1, 2025
భువనగిరి: భూమికి పచ్చాని రంగేసినట్లు..

భూదాన్ పోచంపల్లి పెద్ద చెరువు ఆయకట్టులో వరి పొలాలు పచ్చని రంగుతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఏపుగా పెరిగిన వరి చేలు చూడముచ్చటగా ఉన్నాయని సందర్శకులు తెలిపారు. కనుచూపుమేరలో పచ్చని రంగేసినట్లు కనిపించే పొలాలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఈ ప్రాంతానికి వచ్చిన సందర్శకులు ఈ దృశ్యాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News September 4, 2025
శాస్త్రి ఇండో కెనడియన్ ప్రాజెక్టుకు మహిళా వర్సిటీ ఎంపిక

కెనడాలోని శాస్త్రి ఇండో కెనడియన్ అంతర్జాతీయ ప్రాజెక్టుకు శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఎంపికైనట్లు వీసీ ఆచార్య వి.ఉమ
బుధవారం తెలిపారు. ఈ ప్రాజెక్టు చేయడానికి భారతదేశం నుంచి మొత్తం 30 దేశాలు దరఖాస్తు చేసుకోగా 4 యూనివర్సిటీలు మాత్రమే ఎంపికయ్యాయన్నారు. రెండేళ్ల కాలవ్యవధిలో ఈ ప్రాజెక్టుకు ఏపీ నుంచి పద్మావతి మహిళా వర్సిటీ మాత్రమే ఎంపికవడం గర్వకారణమన్నారు.
News September 4, 2025
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా శేషఫణి ఎంపిక

నంద్యాల పట్టణ సమీపంలోని బలపనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శేషఫణి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. శేషఫణి పనిచేసిన పాఠశాలలలో విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఈనెల 5న విజయవాడలో జరిగే గురుపూజోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పురస్కారం అందుకోబోతున్నారు. పట్టణ ప్రముఖులు శేషఫణికి అభినందనలు తెలిపారు.
News September 4, 2025
అలాంటి లింకులపై క్లిక్ చేయొద్దు: ఎస్పీ

గుర్తు తెలియని లింకులపై క్లిక్ చేయవద్దని నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఏపీకే పేరుతో వచ్చే ఫైల్స్ డౌన్లోడ్ చేయవద్దన్నారు. వివిధ వాట్సాప్ గ్రూపులో షేర్ చేస్తే వచ్చే మెసేజ్లను నమ్మవద్దన్నారు. మీ అనుమతులు లేకుండా ఏవైనా లావాదేవీలు జరిగితే వెంటనే పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే 1930కు కాల్ చేయాలన్నారు.