News April 5, 2025

భువనగిరి: రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్

image

అకాల వర్షాలు, ఈదురు గాలులు, వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం తుర్కపల్లి మండలంలోని దయ్య బండ తండాలో కురిసిన అకాల వర్షాలకు వరి చేలు, మామిడి తోటలు, కూరగాయల పంటలు, మిర్చి తోటలు నష్టపోయిన పంటలను పరిశీలించారు. చేతి కొచ్చిన పంటలు నష్టపోవడంతో రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.

Similar News

News February 23, 2026

విశాఖపట్నంలో 38 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

విశాఖపట్నం DMHO 38 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులు, పట్టణ PHCలో కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు FEB 26వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డీఫార్మసీ, బీఫార్మసీ, DMLT, MLT, డిగ్రీ, BPT, స్పీచ్ &లాంగ్వేజ్ పాథాలజీ, ఆప్టోమెట్రీ, MSc(డిజబిలిటీ స్టడీస్), BEd(స్పెషల్ ఎడ్యుకేషన్), PG(చైల్డ్ సైకాలజీ), BDS/BSc ఉత్తీర్ణులు అర్హులు.

News February 23, 2026

సీఎం కప్ ఫుట్‌బాల్ ఛాంపియన్స్‌గా నల్గొండ!

image

HYDలో జరిగిన సీఎం కప్ రాష్ట్రస్థాయి బాలికల ఫుట్‌బాల్ పోటీల్లో నల్గొండ జట్టు సంచలనం సృష్టించింది. సోమవారం జరిగిన ఫైనల్ పోరులో నిజామాబాద్ జట్టుపై 4-2 గోల్స్ తేడాతో విజయం సాధించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా DYSO అక్బర్ అలీ మాట్లాడుతూ.. నల్గొండ క్రీడాకారిణులు అద్భుత ప్రతిభ కనబరిచారని కొనియాడారు. జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి గిరిబాబు తదితరులు విజేతలను అభినందించారు.

News February 23, 2026

శ్రీకాకుళం: ప్రయాణికులకు గమనిక

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రయాణించే భువనేశ్వర్-బెంగళూరు-భువనేశ్వర్ (రైలు నం.18463/64) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలుకు 3వ ఏసీ భోగిని అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ జనరల్ మేనేజర్ పరమేశ్వర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైలు శ్రీకాకుళం రోడ్డు, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం తదితర రైల్వే స్టేషన్లలో ఆగనుంది.