News March 18, 2025
భువనగిరి: హాస్టళ్లలో ఫిర్యాదు బాక్స్ల ఏర్పాటుకు సిద్ధం

సంక్షేమ వసతిగృహాలు, కస్తూర్భాగాంధీ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు. అన్ని చోట్ల ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటు చేయనున్నారు. హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను రాసి విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిర్యాదుల పెట్టెలో వేయోచ్చు. కలెక్టర్ తనిఖీలకు వచ్చినప్పుడు, వారంలో ఒకసారి పెట్టెను తెరిచి అందులోని ఫిర్యాదులను చూసి పరిష్కారం చూపుతారు. కలెక్టరేట్లో ఫిర్యాదు పెట్టెలు సిద్ధంగా ఉన్నాయి.
Similar News
News March 18, 2025
IPL-2025: తక్కువ జీతమున్న కెప్టెన్ ఇతడే!

మరికొన్ని రోజుల్లో IPL-2025 మొదలుకానుండగా కెప్టెన్ల జీతాలపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఇందులో అత్యధికంగా LSG కెప్టెన్ పంత్ రూ.27 కోట్లు జీతం పొందనున్నారు. అలాగే అత్యల్పంగా KKR కెప్టెన్ రహానె రూ.1.5 కోట్లు తీసుకోనున్నారు. పంత్ తర్వాత అయ్యర్(PBKS) రూ.26.75Cr, గైక్వాడ్ (CSK) ₹18 Cr, సంజూ(RR) ₹18Cr, కమిన్స్(SRH) ₹18Cr, అక్షర్(DC) ₹16.50 Cr, గిల్(GT) ₹16.50Cr, పాండ్య(MI) ₹16.35Cr, రజత్(RCB) ₹11Cr.
News March 18, 2025
రేపు కృష్ణా జిల్లాకు రానున్న మంత్రి నారా లోకేశ్

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో ఆగిపోయిన అశోక్ లేలాండ్ ప్లాంట్కు కొత్త జీవం పోసేందుకు మంత్రి నారా లోకేశ్ బుధవారం జిల్లాకు రానున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్ ద్వారా 45,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు పలువురు అధికారులుు పేర్కొన్నారు. కొన్నేళ్లుగా నిరీక్షణలో ఉన్న స్థానికులకు ఇది వరంలాంటిదన్నారు. ఈ ప్లాంట్ ప్రారంభంతో మల్లవల్లి పారిశ్రామిక హబ్గా ముందడుగు వేయనున్నట్లు తెలిపారు.
News March 18, 2025
అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభం

AP: అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాఫీ ఉత్పత్తులను పరిశీలించిన అనంతరం చంద్రబాబు స్వయంగా పవన్కు కాఫీ అందించారు. దీంతో అక్కడున్నవారంతా చిరునవ్వులు చిందించారు. కాగా <<15795599>>పార్లమెంటులోనూ<<>> అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు ఆమోదం లభించింది.