News March 3, 2025
భూపాలపల్లిలో యాక్సిడెంట్.. ముగ్గురి మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాంపూర్ క్రాస్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన పింగిలి రాజిరెడ్డి, లడ్డు, పంబాపూర్కు చెందిన సతీష్గా ఘటనాస్థలిలోనే మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 16, 2025
ప్రకాశం జిల్లా యువతకు గుడ్ న్యూస్.!

ప్రకాశం జిల్లా ప్రభుత్వ, ప్రైవేట్ ITI కళాశాలల్లో నాలుగో విడత ప్రవేశాలకు కన్వినర్ ప్రసాద్ బాబు మంగళవారం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించారు. అర్హులైన అభ్యర్థులు iti.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఈనెల 27వ తేదీలోగా దరఖాస్తులు నమోదు చేసుకోవాలని తెలిపారు. జిల్లాలోని ఒకటికంటే ఎక్కువ ITIలను ఎంపిక చేసుకోవచ్చని, ప్రభుత్వ ITIలలో 29న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు.
News September 16, 2025
నడిగడ్డలో మట్టిలో కలుస్తున్న మానవ సంబంధాలు

నడిగడ్డలో మానవ సంబంధాలు మట్టిలో కలుస్తున్నాయి. భర్తలను టార్గెట్ చేసి భార్యలు హతమారుస్తున్నారు. 3 నెలల క్రితం గద్వాలకు చెందిన తేజేశ్వర్ను అతడి భార్య ఐశ్వర్య పెళ్లైనా నెలకే కిరాతకంగా హత్య చేయించింది. ఆ సంఘటన మరువకముందే మల్దకల్ మండలం మల్లెందొడ్డిలో పద్మ తన భర్త వెంకటేష్పై వేడి నూనె పోసి చావుకు కారణమైంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విశ్లేషకులు అంటున్నారు.
News September 16, 2025
MBNR: ఇంజినీరింగ్ కాలేజ్ HoDగా డా.రామరాజు

పాలమూరు యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ HoDగా డాక్టర్ పండుగ రామరాజు నియామకమయ్యారు. ఈ మేరకు యూనివర్సిటీ ఉపకులపతి(VC) ప్రొ.జిఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.రమేష్ బాబు డాక్టర్ పండుగ రామరాజుకు నియమక పత్రం అందజేశారు. డాక్టర్ పండుగ రామరాజు ఉస్మానియా యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ, బిట్స్ పిలానీలో పీహెచ్డీ, ఐఐటి మద్రాస్లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా పనిచేశారు. డా.ఎన్.చంద్ర కిరణ్ పాల్గొన్నారు.