News March 4, 2025
భూపాలపల్లి: ఆ కుటుంబాల్లో విషాదం

నిన్న రాత్రి రాంపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదం <<15642532>>3కుటుంబాల్లో<<>> విషాదం నింపింది. మరణించిన పంబాపూర్ వాసి సతీశ్ భార్యకు ఈనెల 6న డెలివరీ డేట్ ఉంది.ఏడాది వయసు గల పాప కూడా ఉంది. ఇక మరో ఇద్దరు మృతులు మహాముత్తారం మండలం మీనాజీపేట వాసులు రవీందర్ రెడ్డి(42),నరసింహారెడ్డి(33)వరుసకు బంధువులు.నర్సింహకు పదేళ్లలోపు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వరుసగా మృతదేహాలు అంత్యక్రియలకు వెళ్లడం గ్రామస్థులందరినీ కంటతడి పెట్టించింది.
Similar News
News March 4, 2025
నల్గొండ: నీట్ పరీక్షకు కలెక్టర్ కసరత్తు

మే 4న నిర్వహించనున్న నీట్ ప్రవేశ పరీక్షకు పరీక్ష కేంద్రాల ఏర్పాటు విషయమై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలలను పరిశీలించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి వద్ద ఉన్న విపస్య పాఠశాల, అలాగే మీర్బాగ్ కాలనీలో ఉన్న నల్గొండ పబ్లిక్ పాఠశాలల్లో నీట్ పరీక్ష కేంద్రాల ఏర్పాటుకై మౌలిక వసతులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
News March 4, 2025
బనకచర్లపై రాజకీయం చేస్తున్నారు: చంద్రబాబు

బనకచర్ల ప్రాజెక్టుకు TG ప్రభుత్వం అడ్డు <<15640378>>చెప్పడంపై<<>> AP CM చంద్రబాబు స్పందించారు. ‘గోదావరి నీళ్లు పోలవరం నుంచి బనకచర్లకు తీసుకెళ్తా అని చెప్పా. సముద్రంలోకి వెళ్లే నీటిని తీసుకెళ్తామంటే ఒక పార్టీ రాజకీయం చేస్తోంది. నాకు 2 ప్రాంతాలు సమానం.. రెండు కళ్లు అని చెప్పా. కాళేశ్వరం ప్రాజెక్టుకు నేనెప్పుడూ అడ్డుచెప్పలేదు. గోదావరిపై ప్రాజెక్టులు కట్టండి, నీళ్లు తీసుకోండి’ అని వ్యాఖ్యానించారు.
News March 4, 2025
సర్వేలు త్వరగా పూర్తి చేయండి: జేసీ

అల్లూరి జిల్లాలో జరుగుతున్న అన్ని రకాల సర్వేలను నిర్దేశిత సమయంలో పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ఆదేశించారు. కలెక్టరేట్లో ఐటీడీఏ పీవోలు, 22 మండలాల ఎంపీడీవోలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఎంఎస్ఎంఈ, మిస్సింగ్ సిటిజన్స్, ఆధార్ నమోదు లేని పిల్లలు, జనన మరణాల ఆలస్య నమోదు, స్కూల్ టాయిలెట్ తనిఖీ, వర్క్ ఫ్రమ్ హోం, పీ4, తదితర సర్వేలు వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు.