News March 31, 2025

భూపాలపల్లి: ‘కొలువుల ధీరుడు’కి 10వ ప్రభుత్వ ఉద్యోగం

image

చిట్యాల మండలం గుంటూరుపల్లి గ్రామానికి చెందిన వెల్ది గోపికృష్ణ టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూపు-1 ఫలితాల్లో 493.5 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 70వ ర్యాంకర్‌గా నిలిచారు. కేంద్ర ప్రభుత్వంలో 07, రాష్ట్ర ప్రభుత్వంలో 3వ ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం గోపికృష్ణ ఖమ్మం మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా ఇటీవల ఆర్డర్ కాపీ తీసుకొని తెలంగాణ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్నాడు.

Similar News

News February 20, 2026

పాత ఫోన్లలో అరుదైన ఖనిజాలు!

image

పాత ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో అరుదైన ఖనిజాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. యుద్ధ విమానాలు, క్షిపణులు, EVల్లో వాడే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఉన్నాయని అంటున్నారు. ఇవి నియోడైమియం, సమారియం వంటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌తో తయారైన శక్తిమంతమైన మ్యాగ్నెట్స్ అని పేర్కొంటున్నారు. వీటిని రిసైకిల్ చేస్తే ఇండియాకు తిరుగుండదని, రేర్ ఎర్త్ మినరల్స్ కోసం విదేశాలపై ఆధారపడాల్సిన పని ఉండదని వెల్లడిస్తున్నారు.

News February 20, 2026

16 శుక్రవారాల వ్రతం ఉద్యాపన విధానం

image

16 శుక్రవారాల వ్రతం పూర్తయ్యే చివరి వారంలో ‘ఉద్యాపన’ చేయాలి. ఆ రోజున 8 మంది బాలురను ఇంటికి పిలిచి భోజనం పెట్టాలి. భోజనంలో పాయసం, పూరీ, బెల్లం, శనగలు వడ్డించాలి. భోజనంలో పులుపు ఉండకూడదు. భోజనం తర్వాత పిల్లలకు అరటిపండు, ప్రసాదం, దక్షిణ ఇవ్వాలి. పిల్లలు ఆ రోజున ఏ విధమైన పులుపు పదార్థాలు తినకుండా జాగ్రత్త వహించాలి. అప్పుడే వ్రతం సంపూర్ణమవుతుంది. అమ్మవారి కృపతో ఆ ఇల్లు సుఖశాంతులతో నిండిపోతుంది.

News February 20, 2026

బంగారు మనసు.. 100గ్రా. గోల్డ్ తిరిగిచ్చేశాడు!

image

₹15 లక్షల విలువైన బంగారాన్ని తిరిగిచ్చి స్క్రాప్ డీలర్ నిజాయతీ చాటుకున్నారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో అశోక్ శర్మ 2025లో కుంభమేళాకు వెళ్తూ 100G బంగారం పేపర్లో దాచి మరిచిపోయారు. దీపావళికి ఇల్లు క్లీన్ చేసి, పొరపాటున స్క్రాప్‌తో కలిపి అమ్మేశారు. తర్వాత స్క్రాప్‌ షాపులో వెతికినా బంగారం దొరకలేదు. ఈ క్రమంలో 4 నెలల తర్వాత షాప్ యజమాని అఖ్తర్ ఖాన్‌కు బంగారం కనిపించింది. పోలీసుల ద్వారా అశోక్‌కు అందజేశారు.