News September 17, 2025
భూపాలపల్లి జిల్లాలో వర్షపాతం వివరాలివే!

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 205.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మహదేవపూర్ 39.4, పలిమెల 10.6, మహముత్తారం 18.6, కాటారం 34.8, మల్హర్ 3.6, చిట్యాల 8.2, టేకుమట్ల 26.8, మొగుళ్లపల్లి 11.0, రేగొండ 11.4, గణపురం 14.8, భూపాలపల్లి 26.2 మి.మీ.లుగా నమోదైంది.
Similar News
News September 17, 2025
గోదావరిఖని నుంచి బీదర్కు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు

GDK RTC డిపో ఆధ్వర్యంలో పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ఈ నెల 25వ తేదీ రాత్రి 10 గంటలకు బీదర్కు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుంది. ఈ ట్రిప్లో భక్తులు బీదర్ జల నరసింహస్వామి, రేజింతల్, జరసంగమం పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చని DM నాగభూషణం తెలిపారు. ఈ యాత్ర 26వ తేదీ రాత్రికి GDK తిరిగి చేరుకుంటుంది. టికెట్ ₹1,600గా ధర నిర్ణయించారు. టిక్కెట్ల రిజర్వేషన్ కోసం 7013504982 నంబర్ను సంప్రదించవచ్చు.
News September 17, 2025
ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో మంత్రి సురేఖ

వరంగల్ ఓ సిటీ IDOC మైదానంలో ఏర్పాటుచేసిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముఖ అతిధిగా మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి, ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
News September 17, 2025
RGM: పోలీస్ కమిషనరేట్ లో ప్రజా పాలన దినోత్సవం

రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో బుధవారం ప్రజా పాలన దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ గీతం, రాష్ట్ర గీతం ఆలపించారు. గోదావరిఖని ACPలు మడత రమేష్, శ్రీనివాస్, ప్రతాప్, శ్రీనివాస్, రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.