News March 21, 2025

భూపాలపల్లి జిల్లాలో 3,441 మంది విద్యార్థులు హాజరు

image

భూపాలపల్లి జిల్లాలోని 20 పరీక్షా కేంద్రాల్లో శుక్రవారం ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యం.రాజేందర్ తెలియజేశారు. 3,449 విద్యార్థులకు 3,441 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు వారు తెలిపారు. పరీక్ష కేంద్రాలలో వైద్యం, కరెంటు, రవాణా సౌకర్యాలు తదితర మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

Similar News

News July 4, 2025

గద్వాల: ‘ఆపరేషన్ ముస్కాన్-11 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’

image

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్-11 కార్యక్రమాన్ని సంబంధిత శాఖ అధికారులు విజయవంతం చేయాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం గద్వాలలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పిపోయిన పిల్లలను గుర్తించి, వారిని రక్షించి, పునరావాసం కల్పించి సమస్యను పరిష్కరించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.

News July 4, 2025

RJPT: భూ భారతి దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్

image

రాజంపేట మండలం తలమడ్లలో శుక్రవారం కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ భూ భారతి దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పర్యటించారు. దేవాయిపల్లిలో జరుగుతున్న దరఖాస్తుల పరిశీలించారు. సమీక్షించిన కలెక్టర్, భూ భారతి చట్టానికి అనుగుణంగా ప్రతి దరఖాస్తును నిష్పక్షపాతంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని తహశీల్దార్‌ జానకికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వీణ, డిప్యూటీ తహశీల్దార్ సంతోషి, సిబ్బంది పాల్గొన్నారు.

News July 4, 2025

రామన్నపేట: స్కూల్‌కు వెళ్లడానికి ట్రాక్టర్లే గతి!

image

రామన్నపేట(M) కుంకుడుపాముల విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి అగచాట్లు పడుతున్నారు. బస్సు సౌకర్యం లేక ట్రాక్టర్‌పై అమ్మనబోలులోని స్కూల్‌కు వెళ్తున్నారు. ప్రమాదమని తెలిసీ తప్పక ప్రయాణించి గమ్యం చేరుకుంటున్నారు. ఒక బస్సు NLG-NKP-అమ్మనబోలు వచ్చి వేరే రూట్లో వెళ్తుంది. దాన్ని అమ్మనబోలు-కుంకుడుపాముల మీదుగా రామన్నపేటకు అధికారులు తీసుకొస్తే పిల్లల సమస్య తీరుతుందని గ్రామానికి చెందిన మిర్యాల రమేశ్ తెలిపాడు.