News March 21, 2025
భూపాలపల్లి జిల్లాలో 3,441 మంది విద్యార్థులు హాజరు

భూపాలపల్లి జిల్లాలోని 20 పరీక్షా కేంద్రాల్లో శుక్రవారం ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యం.రాజేందర్ తెలియజేశారు. 3,449 విద్యార్థులకు 3,441 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు వారు తెలిపారు. పరీక్ష కేంద్రాలలో వైద్యం, కరెంటు, రవాణా సౌకర్యాలు తదితర మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
Similar News
News February 15, 2026
శివ నామాలు అర్థాలు ‘‘దక్షిణామూర్తి’’

శివుడు కేవలం లయకారుడే కాదు, సకల విద్యాప్రదాత కూడా. మౌనంగా ఉంటూనే తన ముద్రల ద్వారా పరమ సత్యాన్ని బోధించే ఆదిగురువు ఈయన. దక్షిణం వైపు ముఖం చేసి కూర్చుని సనకాది మునులకు జ్ఞానాన్ని ఉపదేశించారు కాబట్టి ఈయనకు ‘దక్షిణామూర్తి’ అనే పేరు వచ్చింది. మేధస్సు, జ్ఞానం, సంగీతం, యోగం వంటి కళలన్నింటికీ ఈయనే మూలపురుషుడు. విద్యార్థులు, జ్ఞానాన్వేషకులు ఈయనను ధ్యానించడం వల్ల అత్యున్నతమైన బుద్ధిని పొందుతారు.
News February 15, 2026
బహిరంగ ప్రదేశాల్లోనే రాజన్న భక్తుల బస

మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడకు తరలివచ్చిన వేలాది మంది భక్తులు బహిరంగ ప్రదేశాలలో బస చేస్తున్నారు. ఉత్సవాలకు సుమారు రెండు లక్షలకు పైగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండగా, ఆలయ, ప్రైవేటు వసతి గదులు ఐదు శాతం మంది భక్తులకు కూడా సరిపోవు. దీంతో మహాశివరాత్రి జాగరణ కోసం వచ్చే భక్తులు గుడి చెరువు పార్కింగ్ స్థలంలో ఏర్పాటు చేసిన టెంట్ల కింద, ఇతర బహిరంగ ప్రదేశాలలో బస చేస్తున్నారు.
News February 15, 2026
మొన్న డోర్ హ్యాండిల్స్, ఇప్పుడు స్టీరింగ్ వీల్పై చైనా నిషేధం!

వాహన భద్రతా ప్రమాణాలను చైనా కఠినతరం చేసింది. ఇటీవల ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ను బ్యాన్ చేయగా, తాజాగా హాఫ్ స్టీరింగ్ వీల్స్ను నిషేధించింది. 2027 Jan 1 నుంచి కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. ప్రమాదాల్లో డ్రైవర్లకు తగిలే గాయాల్లో 46% స్టీరింగ్ వ్యవస్థ కారణమవుతోంది. హాఫ్ స్టీరింగ్ వల్ల తీవ్రత పెరుగుతోంది. యాక్సిడెంట్లలో ఫ్లష్ హ్యాండిల్స్ తెరుచుకోని ఘటనలు ఎక్కువయ్యాయి. దీంతోనే వాటిని బ్యాన్ చేసింది.


