News January 20, 2026
భూపాలపల్లి: దివ్యాంగులకు ఉచిత సహాయక పరికరాల పంపిణీకి దరఖాస్తులు

తెలంగాణ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను దివ్యాంగులు, బాధితులకి మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్స్, హైబ్రిడ్ వీల్ ఛైర్, వినికిడి పరికరాలు, ట్యాబ్లు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అర్హులైన దివ్యాంగులు https://tgobmms.cgg.gov.in వెబ్సైట్ ద్వారా జనవరి 30, 2026లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.
Similar News
News April 14, 2026
దివ్యాంగులకు శుభవార్త.. కొత్తగా లక్ష పింఛన్లు!

TG: రాష్ట్రంలోని దివ్యాంగులకు శుభవార్త. కొత్తగా లక్ష మందికి పింఛన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దివ్యాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ వీరయ్య వెల్లడించారు. 40 శాతం వైకల్యం ఉన్నవారికి అవసరమైన అడ్వాన్స్డ్ పరికరాలను ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఇప్పటికే దివ్యాంగులకు తొలి విడతలో 4,500 ఇందిరమ్మ ఇళ్లను, 2వేల స్కూటీలను ఫ్రీగా పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.
News April 14, 2026
విజయవాడలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం

గవర్నర్పేటలోని అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయంలో మంగళవారం అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి DGP హరీష్ కుమార్ గుప్తా హాజరై వారోత్సవాలకు శ్రీకారం చుట్టారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అగ్నిమాపక సిబ్బందికి నివాళులర్పించారు. అగ్నిమాపక యంత్రాలు, పరికరాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించి, ప్రమాదాల సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించే సిబ్బంది సేవలను కొనియాడారు.
News April 14, 2026
విద్యార్థులకు అలర్ట్.. అడ్మిషన్లు ప్రారంభం

విద్యార్థులకు, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో Vishwa Vishwani Institute of Systems and మేనేజ్మెంట్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది నూతనంగా BS Computer Science (UGC AEDP) కోర్సును ప్రారంభించారు. ఈ 4 సంవత్సరాల ప్రోగ్రామ్లో 2 ఏళ్లు క్యాంపస్లో చదువు, తదుపరి 2 సంవత్సరాలు ఇండస్ట్రీలో అప్రెంటిషిప్ శిక్షణ ఉంటుందన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.


