News November 17, 2025
భూపాలపల్లి: ‘ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించాలి’

ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం మంజూరు నగర్లో భూపాలపల్లి నూతన ఇండియా బ్యాంక్ శాఖను రిబ్బన్ కట్ చేసి కలెక్టర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు ఆధునిక, సమగ్ర బ్యాంకింగ్ సేవలను అందించాలనే లక్ష్యంతో, ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఇండియా బ్యాంక్ జిల్లాలో నూతన శాఖను ప్రారంభించినట్లు తెలిపారు.
Similar News
News November 17, 2025
ములుగు జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

ములుగు జిల్లాలోని పలు మండలాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈరోజు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా గోవిందరావుపేట మండలంలోని పలు కిరాణా, హోటల్లు, ఇతర షాపుల్లో తనిఖీలు చేపట్టి, వ్యాపారస్థులకు పలు సూచనలు చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ మాట్లాడుతూ.. వ్యాపార సముదాయాల్లో, హోటళ్లలో గడువు దాటిన, కల్తీ వస్తువులు అమ్మొద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News November 17, 2025
ములుగు జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ

ములుగు జిల్లాలోని పలు మండలాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈరోజు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా గోవిందరావుపేట మండలంలోని పలు కిరాణా, హోటల్లు, ఇతర షాపుల్లో తనిఖీలు చేపట్టి, వ్యాపారస్థులకు పలు సూచనలు చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ మాట్లాడుతూ.. వ్యాపార సముదాయాల్లో, హోటళ్లలో గడువు దాటిన, కల్తీ వస్తువులు అమ్మొద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News November 17, 2025
VJA: రూ.15వేల పెన్షన్కు అర్హులైనతే సర్టిఫికెట్ పొందవచ్చు

పెరాలసిస్, మస్క్యులర్ డిస్ట్రోఫీ, తలసేమియా, కిడ్నీ వ్యాధిగ్రస్థులు, గుండె మార్పిడి వంటి తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్న ఎన్టీఆర్ జిల్లా వాసులు రూ. 15వేల పెన్షన్ పొందడానికి ప్రతి మంగళవారం విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వేంకటేశ్వరరావు సోమవారం తెలిపారు. ఉదయం 9 గంటలకు వచ్చి స్పెషలిస్టుల పరీక్షల అనంతరం సర్టిఫికెట్లు పొందాలని సూచించారు.


