News October 13, 2025

భూపాలపల్లి: బయోమెట్రిక్ ఆధారంగా వేతనాలు చెల్లించాలి: కలెక్టర్

image

భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ అన్ని శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్ ఆధారంగా జీతాలు చెల్లించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో సంక్షేమ కార్యక్రమాలు పరిశీలన, ముందస్తు అనుమతులు లేకుండా సెలవులు వినియోగం తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ప్రతి శాఖాధికారి ముందస్తు అనుమతి లేకుండా సెలవులలో వెళ్లరాదని సూచించారు.

Similar News

News October 13, 2025

తిరుపతి జిల్లాలో ITI చదవాలి అనుకుంటున్నారా?

image

తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కాలేజీల్లో మిగిలిన సీట్లకు 5వ విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు తిరుపతి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ గణేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి పాస్/ ఫెయిల్ అయిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 16. మరిన్ని వివరాలకు దగ్గరలోని ఐటీఐ కాలేజీని సంప్రదించాలి.

News October 13, 2025

ట్రంప్, నెతన్యాహును ప్రశంసించిన మోదీ

image

హమాస్ నిర్బంధం నుంచి రెండేళ్ల తర్వాత ఇజ్రాయెల్ బందీలు విడుదల కావడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘బందీలకు లభించిన ఈ స్వేచ్ఛ వారి కుటుంబాల ధైర్యానికి నివాళిగా నిలుస్తోంది. ప్రెసిడెంట్ ట్రంప్ అసమాన శాంతి ప్రయత్నాలు, ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు దృఢ సంకల్పానికి ఇది నిదర్శనం. ఆ ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి ట్రంప్ చేసిన హృదయపూర్వక కృషిని స్వాగతిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.

News October 13, 2025

‘యంగ్ ఇండియా గురుకులాలను వేగవంతంగా నిర్మించాలి’

image

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా సమీకృత గురుకుల విద్యాలయ భవనాల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం యంగ్ ఇండియా గురుకులాల నిర్మాణం, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం సంబంధించి బిల్లులు 24 గంటల లోపు క్లియర్ చేయాలని, పనులు ఎక్కడా ఆలస్యం కావడానికి వీలు లేదన్నారు.