News February 28, 2025

భూపాలపల్లి: బోనస్ నగదు జమకాక రైతులు ఇబ్బందులు

image

రైతులకు వరి ధాన్యం బోనస్ నగదు జమ కాక ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం విక్రయించి 50 రోజులు గడుస్తున్నా నగదు జమ కావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రూ.2,320 మద్దతు ధరతో పాటు.. క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తోందని, జిల్లాలో దాదాపు 81,700 మెట్రిక్ టన్నులు సన్న ధాన్యాన్ని విక్రయించగా రూ.16 కోట్లు మాత్రమే నగదు జమకాగ.. రూ.24 కోట్ల నగదు చెల్లించాల్సి ఉందని అధికారులు తెలిపారు.

Similar News

News March 1, 2026

KNR: ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

HYD బోయినపల్లిలోని వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో 2026-27 విద్యా సంవత్సరానికి 5 తరగతిలో ప్రవేశాలకు గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి దివాకర్ రావు తెలిపారు. దీంతో పాటు పలు తరగతులలో ఖాళీగా ఉన్న 21 సీట్లను సైతం భర్తీ చేస్తామన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 12 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 1, 2026

వేట్లపాలెం ప్రమాదంపై డిప్యూటీ సీఎం, హోంమంత్రి సమీక్ష

image

వేట్లపాలెం బాణసంచా పేలుడుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు మురళీ మోహన్, నిరంజన్ రెడ్డి వారిని కలిసి వివరాలను వివరించారు. ప్రమాదానికి గల కారణాలు, భద్రతా లోపాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. బీజేపీ నేత మాధవ్ కూడా పాల్గొన్న ఈ భేటీలో బాధితులకు అండగా ఉండాలని నిర్ణయించారు.

News March 1, 2026

మహారాష్ట్రలో భారీ ప్రమాదం.. 15 మంది మృతి

image

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ కటోల్ ప్రాంతంలో పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమలో భారీ ప్రమాదం సంభవించింది. SBL ఎనర్జీ లిమిటెడ్‌లో జరిగిన ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా 10 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.