News December 26, 2025

భూపాలపల్లి: యాసంగి సీజన్‌లో సన్నాళ్లకే సై అంటున్న రైతులు!

image

జిల్లాలో యాసంగి సీజన్లో వరి పంట సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ అందజేస్తుండడంతో యాసంగిలో రైతులు సన్న రకం వరి పంటను సాగు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో నాట్లు వేస్తున్నారు. ఇప్పటికే నారు పోసి మడులను నేటితో నింపి భూమిని సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో 97,570 ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా.

Similar News

News December 27, 2025

సాగుభూమి సంరక్షణ వ్యవసాయంలో కీలకం

image

సాగు భూములకు రసాయనాల వాడకం తగ్గించడం, సేంద్రియ ఎరువుల వాడకం పెంచడం, పంట మార్పిడి, మిశ్రమ పంటల సాగు, సంప్రదాయ, దేశవాళీ పంట రకాల పెంపకం, నేలకోత నివారణ చర్యలు, నేలను కప్పి ఉంచడం వంటి చర్యలతో నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, పంటల అవశేషాలు, జీవన ఎరువులు, పశువుల వ్యర్థాలు, వర్మీకంపోస్టు వంటి సేంద్రియ ఎరువుల వాడకం వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

News December 27, 2025

WGL: అభివృద్ధి ఒక వైపేనా..!

image

గ్రేటర్ వరంగల్ నగరం పేరుకే గ్రేటర్‌లా ఉంది. అభివృద్ధి అంతా ఒక వైపే జరుగుతోంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోనే రెండేళ్లలో రూ.4 వేల కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నారు.వరంగల్ తూర్పు, వర్ధన్నపేటలో మాత్రం ఇప్పటికీ రూ.100 కోట్ల లోపే పనులకు శంకుస్థాపనలు జరిగినట్టు ప్రజలు చెబుతున్నారు. వరంగల్ పశ్చిమలో నిత్యం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతుండగా.. మిగిలిన 2 ప్రాంతాల్లో కనిపించకపోవడం గమనార్హం.

News December 27, 2025

తిర్యాణి: తల్లిదండ్రులు మందలించారని యువతి SUICIDE

image

ASF జిల్లా తిర్యాణి మండలం నాయకపూగూడకు చెందిన పల్లె స్పందన(19) శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఆత్మహత్య చేసుకుంది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. HYDలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ఆమె, పని ఒత్తిడితో అనారోగ్యానికి గురైంది. ఇంటికి రావాలని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది శుక్రవారం ఫినాయిల్ తాగింది. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.