News April 15, 2025

భూపాలపల్లి: వేసవి సెలవులు.. ఓ కన్నేసి ఉంచండి!

image

ఈనెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. అయితే సెలవుల్లో పిల్లలు చెరువులు, బావుల్లో ఈతకు వెళ్లకుండా చూడాలని తల్లితండ్రులకు అధికారులు సూచిస్తున్నారు. వారిపై ఓ కన్నేసి ఉంచాలని చెబుతున్నారు. స్నేహితులతో దూర ప్రాంతాలకు పంపవద్దని, బైకులు ఇవ్వొద్దని, ఫోన్ వాడకుండా చూడాలని అంటున్నారు. కాగా, BHPL జిల్లాలో సెలవుల్లో ప్రమాదాల బారినపడి పిల్లలు మరణించిన సందర్భాలూ ఉన్నాయి.

Similar News

News November 14, 2025

KMR: అద్దె ప్రాతిపదికన వ్యాన్

image

కామారెడ్డి జిల్లా మహిళా సాధికారత కేంద్రం అవసరాల నిమిత్తం ECO వ్యాన్‌ను అద్దె ప్రాతిపదికన నడుపుటకు టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు KMR జిల్లా సంక్షేమ అధికారిని ప్రమీల తెలిపారు. ఆసక్తి గల వారు తమ వాహన డాక్యుమెంట్ ప్రతులతో కూడిన దరఖాస్తులను సీల్డ్ కవర్‌లో ఈ నెల 20వ తేదీ వరకు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అద్దె చెల్లించబడుతుందని పేర్కొన్నారు.

News November 14, 2025

ట్రంప్‌కు క్షమాపణలు చెప్పిన BBC

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వీడియోను తప్పుగా ఎడిట్ చేసినందుకు ప్రముఖ మీడియా సంస్థ <<18245964>>BBC<<>> ఆయనకు క్షమాపణలు చెప్పింది. వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుందామని పేర్కొంది. అయితే పరువునష్టం చెల్లించాలన్న ట్రంప్ డిమాండ్‌ను తిరస్కరించింది. తాము ఉద్దేశపూర్వకంగా వీడియో ఎడిట్ చేయలేదని స్పష్టం చేసింది. ట్రంప్ డాక్యుమెంటరీని తిరిగి ప్రసారం చేసే ఉద్దేశం తమకు లేదని బీబీసీ న్యాయవాది తెలిపారు.

News November 14, 2025

TTD ఈవోను ప్రశ్నించిన సిట్ ఆధికారులు..?

image

తిరుమల కల్తీ నెయ్యి కేసుపై ఏర్పాటైన సీబీఐ సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. టీటీడీ ప్రస్తుత ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ను రెండు రోజులు క్రితం కలిసినట్లు సమాచారం. నెయ్యి టెండర్ల విధివిధానాలు మార్చినప్పుడు ఈవోగా ఆయనే ఉండటంతో దానిపై మాట్లాడినట్లు తెలుస్తోంది. టెండర్ల గురించి ముందు అధికారులను అడిగితే తెలుస్తుందని మాజీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. దీంతో సింఘాల్‌ను కలిసి ఈ అంశాలపై చర్చినట్లు సమాచారం.