News February 4, 2025

భూపాలపల్లి: సింగరేణి ఉద్యోగులకు శుభవార్త

image

2024- 25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించేందుకు ఉద్యోగులకు స్పెషల్ ఇన్సెంటివ్‌ను ప్రవేశపెడుతూ సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి జనవరి వరకు 53.73 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది. ఫిబ్రవరి, మార్చిలో మిగతా 18.27 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధనకు ఉద్యోగులకు స్పెషల్ ఇన్సెంటివ్ అందించనున్నారు.

Similar News

News July 4, 2025

తహశీల్దార్లు మరింత ఫోకస్ చేయాలి: BHPL కలెక్టర్

image

భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కరానికి తహశీల్దార్లు మరింత ఫోకస్ చేయాలని, షెడ్యూల్ సిద్ధం చేసి నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ హాలులో ఆయన భూ భారతి రెవెన్యూ సదస్సుల దరఖాస్తులు పరిష్కారానికి తీసుకున్న చర్యలపై అధికారులతో  సమీక్షా సమావేశం నిర్వహించారు. దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేయాలని ఆయన సూచించారు.

News July 4, 2025

మొగల్తూరు: కారు ఢీకొని రైతు మృతి

image

పేరుపాలెం నార్త్‌లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రైతు గుత్తుల పెద్దిరాజు మృతి చెందారు. పేరుపాలెం బీచ్ నుంచి భీమవరం వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సమీపంలో అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. కాలువ పక్కనే పచ్చగడ్డి కోస్తున్న పెద్దిరాజును కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న వారికి ఏమి కాలేదు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.

News July 4, 2025

ఒక్క బిడ్డకు జన్మనిస్తే రూ.1.30 లక్షలు!

image

జనాభా సంక్షోభాన్ని అధిగమించేందుకు చైనా ఓ పథకం ప్రవేశపెట్టనుంది. ఒక్కో బిడ్డను కంటే ఏడాదికి 3,600 యువాన్లు (రూ.43 వేలు) రివార్డు ఇచ్చేందుకు సిద్ధమైంది. మూడేళ్లపాటు ఈ నగదు ప్రోత్సాహాన్ని కొనసాగించనుంది. ఇప్పటికే చైనాలోని మంగోలియా ప్రాంతంలో రెండో బిడ్డను కంటే రూ.6లక్షలు, మూడో బిడ్డను కంటే రూ.12 లక్షలు ఇస్తున్నారు. పెళ్లిళ్ల సంఖ్య తగ్గిపోవడం, ఫలితంగా జననాల రేటు పడిపోతుండటంతో ఈ చర్యలు తీసుకుంటోంది.