News February 4, 2025

భూముల క్రమబద్ధీకరణకు అవకాశం: విశాఖ జేసీ 

image

విశాఖలో అర్బన్ పరిధిలో మిగుల భూముల ఆక్రమణలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు జేసీ అశోక్ తెలిపారు. 1.5.2019కి ముందు నుంచి భూమి ఆక్రమణలో ఉన్నట్టుగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, GVMC అప్రూవల్ ప్లాన్, ఇంటి పన్ను రసీదు, కరెంటు బిల్ రసీదులతో సంబందిత తహశీల్దార్ కార్యాలయంలో డిసెంబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు తహశీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

Similar News

News February 4, 2025

మిథిలాపురి: ఉరి వేసుకొని వ్యక్తి సూసైడ్

image

విశాఖలోని మిథిలాపురిలో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. మృతుడు విజయనగరం జిల్లా తెర్లాం మండలం పనుకువలస గ్రామానికి చెందిన అలుగుబెల్లి గణేశ్ (43)గా గుర్తించారు. విశాఖలో పెయింటర్‌గా పనిచేస్తున్న గణేశ్ మిథిలాపురిలోని ఉడాకాలనీలో 9 నెలలుగా ఉంటున్నాడు. కాగా మంగళవారం ఉదయం హాల్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతిచెందినట్లు పీఎంపాలెం పోలీసులు తెలిపారు.

News February 4, 2025

వాల్తేరు డివిజన్‌కు మూడు వందే భారత్‌లు: DRM 

image

వాల్తేర్ డివిజన్‌కు త్వరలో మూడు వందే భారత్, ఒక అమృత్ భారత్ రైలు రానున్నట్లు వాల్తేర్ DRM మనోజ్ కుమార్ సాహూ తెలిపారు. విశాఖ రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయిన అభివృద్ధి పనులకు కొత్త టెండర్లను పిలిచామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. రైల్వే‌కు ఈ ఏడాది ఎక్కువ బడ్జెట్ కేటాయించడం హర్షనీయమన్నారు. వేగంగా నడిచే రైళ్ల కోసం లైన్ల ఆధునీకరణ పనులు చేస్తున్నట్లు తెలిపారు.

News February 4, 2025

భీమిలి: భార్య పుట్టింటి నుంచి రావడం లేదని సూసైడ్

image

భీమిలి మండలం కొత్తూరు గ్రామంలో నివాసం ఉంటున్న ఉమ్మిడి నరేంద్ర(31) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాకపోవడంతో మనస్తాపం చెంది ఉరి వేసుకున్నట్లు నరేంద్ర తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భీమిలి హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ తెలిపారు. 

error: Content is protected !!