News June 11, 2024
భూవివాదం.. 3 రోజులుగా మార్చురీలోనే మృతదేహం
చౌటుప్పల్ మం. పంతంగిలో దారుణం జరిగింది. స్థానికుల వివరాలిలా.. హన్మంతరెడ్డి HYDలో ఉంటున్నారు. అతడికి సోదరుడు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. వీరికి 7.24 ఎకరాల భూమి ఉంది. వివాదం పరిష్కరించుకోవడానికి హన్మంతరెడ్డి గ్రామానికి వచ్చాడు. ఎటూ తేలకపోవడంతో మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నాడు. వివాదం పరిష్కారమయ్యాకే అంత్యక్రియలు నిర్వహించాలని మృతుడి బంధువులు డిసైడ్ అవడంతో మూడు రోజులుగా మృతదేహం మార్చురీలోనే ఉంది.
Similar News
News September 30, 2024
యాదాద్రి కొండపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో వచ్చే నెల 3వ తేదీ నుంచి 12 తేదీ వరకు దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ భాస్కరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
News September 30, 2024
సమగ్ర కుల జనగణన చేయాలి: తీన్మార్ మల్లన్న
సమగ్ర కుల జనగణన చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఆదివారం సమగ్రకుల జన గణన సాధనకై బేగంపేట టూరిస్ట్ ప్లాజాలో ఉద్యోగులు, మేధావులు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ కుల జనగణన చేయకపోతే, 42 శాతం రిజర్వేషన్లకు బీసీలకు ఇవ్వకపోతే తీన్మార్ మల్లన్నదే బాధ్యత అని అన్నారు.
News September 30, 2024
NLG: 50 కార్గో కౌంటర్లలో లాజిస్టిక్ సేవలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏడు ఆర్టీసీ డిపోల పరిధిలో 50 కార్గో లాజిస్టిక్ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ రీజియన్ లాజిస్టిక్ ఏటీఎం సి.రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు వారి పార్సిళ్లను లాజిస్టిక్ బుక్ చేసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు భద్రంగా చేరుస్తామని పేర్కొన్నారు.