News April 15, 2025
భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులు: జనగామ కలెక్టర్

భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులకు సూచించారు. మంగళవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో డిప్యూటీ తహశీల్దార్లు, డీపీఎంలు, ఏపీఎంలతో భూ భారతి – కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆహార భద్రత కార్డుల పరిశీలన ప్రక్రియ, ధాన్యం కొనుగోళ్లపై గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు.
Similar News
News January 3, 2026
అనకాపల్లి జిల్లాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

అనకాపల్లి జిల్లాలో 83 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. కేజీబీవీ టైప్-3 విభాగంలో 20, టైప్-4 విభాగంలో 63 పోస్టులకు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి జనవరి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
News January 3, 2026
ఏలూరు జిల్లా కస్తూర్బా స్కూళ్లలో ఉద్యోగాలు

కాకినాడ జిల్లాలో 2 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. టైప్ – 3 కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో 2 పోస్టులను భర్తీ చేయనున్నారు. నేటి నుంచి జనవరి 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. టెన్త్ పాసైన మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
News January 3, 2026
ఇంద్రకీలాద్రిపై ఆరుద్రోత్సవ పూజలు

ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో శుక్రవారం నుంచి 3 రోజుల పాటు జరిగే నటరాజస్వామి ఆరుద్రోత్సవ కళ్యాణ ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. 1954లో నిర్మించిన ఈ ఆలయం, చిదంబరం ఆలయం తరహాలో చంద్రశిలలతో విగ్రహాలను కలిగి ఉంది. ఈ పూజల్లో ఆలయ కార్యనిర్వాహణాధికారి శీనా నాయక్, నటరాజస్వామి ఆలయ నిర్మాణదాతలు చెన్నాప్రగఢ కోటంరాజు వంశీకులు నాగేశ్వరి దంపతులు, ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్, పాల్గొన్నారు.


