News April 15, 2025
భూ భారతి పైలెట్ ప్రాజెక్టుగా మద్దూరు మండలం ఎంపిక

భూభారతిపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సమావేశానికి నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ హాజరయ్యారు. భూభారతి పైలట్ ప్రాజెక్ట్ సదస్సులను జిల్లాలోని మద్దూరు మండలాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు.
Similar News
News April 16, 2025
పార్టీ పటిష్ఠతకు కమిటీలు ఏర్పాటు చేయాలి: రాజశేఖర్ రెడ్డి

పార్టీని పటిష్ట పరిచేందుకు బీజేపీ మండల కమిటీలను జిల్లా కమిటీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు డాక్టర్ రాజశేఖరరెడ్డి తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొప్పుల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘటన సంరచనా సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఘటన సంరచనా ప్రభారి పడాకుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈనెల 20లోగా కమిటీలు పూర్తి చేయాలన్నారు.
News April 16, 2025
NLG: హత్యాయత్నం కేసులో ఒకరికి జైలు శిక్ష

గిరిజన మహిళపై హత్యాయత్నం చేసిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ NLG SC, ST కోర్టు జడ్జి రోజారమణి బుధవారం తీర్పునిచ్చారు. 2018 అక్టోబర్ 13న రాత్రి నాంపల్లిలోని దామెరకు చెందిన ఓ మహిళను అదే గ్రామానికి చెందిన మహేశ్ పత్తి చేలోకి తీసుకెళ్లి ఆమెపై యాసిడ్ పోసి హత్యాయత్నం చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా జడ్జి జైలు శిక్ష విధించారు.
News April 16, 2025
41 రైతు సంఘాలకు డ్రోన్ల పంపిణీ: జేసీ కార్తీక్

వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీని రైతులు అందిపుచ్చుకోవాలని నెల్లూరు జేసీ కార్తీక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పించారు. తక్కువ ఖర్చుతో మెరుగైన ఆదాయం పొందేందుకు శాస్త్ర సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయని ఆయన వెల్లడించారు. జిల్లాలో 41 రైతు సంఘాలకు డ్రోన్స్ ఇస్తున్నట్లు కార్తీక్ పేర్కొన్నారు.