News March 26, 2026
భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్

జిల్లాలో పెండింగ్లో ఉన్న సాదాబైనామా, భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. జీవో 76 ప్రకారం అర్హులకు పట్టాలు జారీ చేయాలన్నారు. భూ సమస్యలతో పాటు ఎలక్షన్ మ్యాపింగ్, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్డీవోలు, తహసీల్దార్లకు సూచించారు.
Similar News
News April 14, 2026
VJA: బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. ముగ్గురి అరెస్ట్!

బెట్టింగ్లకు పాల్పడుతున్న ఓ ముఠాను పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల మేరకు.. ప్రసాదంపాడుకు చెందిన రాజేశ్ ఫ్యాన్సీ దుకాణం నడుపుతున్నాడు. IPL ప్రారంభం అవ్వగానే సబ్ బుకీ అవతారమెత్తాడు. రాధే ఎక్సేంజ్ బెట్టింగ్ యాప్ ద్వారా బెట్టింగ్ చేస్తున్నాడు. అతనిపై పోలీసులు నిఘా ఏర్పాటు చేసి సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అతనికి సహకరిస్తున్న ఆనంద్ రెడ్డి, శివయ్యలను అదుపులోకి తీసుకున్నారు.
News April 14, 2026
కామారెడ్డిలో కూరగాయల ధరలు ఇలా!

కామారెడ్డి మార్కెట్లో కూరగాయల ధరలు మంగళవారం సాధారణంగా కొనసాగుతున్నాయి. మార్కెట్లో కేజీ టమాటా రూ.20, బీరకాయ రూ.60, క్యాబేజీ రూ.50, కాకరకాయ రూ.60, ఆలుగడ్డ రూ.30, ఉల్లిపాయ రూ.20గా విక్రయిస్తున్నారు. అలాగే పాలకూర రూ.50, వంకాయ రూ.50, క్యారెట్ రూ.50, చిక్కుడు రూ.50, కాలీఫ్లవర్ రూ.50, క్యాప్సికమ్ రూ.50 ధరలకు లభిస్తున్నాయి. ధరలు స్థిరంగా ఉండటంతో వినియోగదారులు కొంత ఊరట వ్యక్తం చేస్తున్నారు.
News April 14, 2026
బాపట్ల: ఫైఓవరపై దొరికిన వ్యక్తి మృతి..ఆచూకీ తెలిస్తే తెలపండి

బాపట్లలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి సోమవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం గుంటూరు రహదారి ఫ్లైఓవర్పై అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడిని స్థానికులు 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. చికిత్స ఫలితం లేక మరణించాడని, మృతుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


