News March 5, 2026

భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలోని 16 గ్రామాల్లో 1983 పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేశామని కలెక్టర్ వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ జయలక్ష్మికి తెలిపారు. ఏపీ సచివాలయం నుంచి బుధవారం జిల్లా కలెక్టర్లతో సీసీఎల్ఏ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 22 ఏ భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని కలెక్టర్ వివరించారు.

Similar News

News April 14, 2026

ATP: భార్యపై చాకుతో దాడి.. భర్త అరెస్ట్

image

అనంతపురంలో భార్యపై భర్త <<19650878>>చాకుతో దాడి<<>> చేసిన ఘటన తెలిసిందే. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు త్రీటౌన్ CI రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు. గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుందన్నారు. ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు ధ్రువీకరించారన్నారు. నిందితుడు రాజీవ్ కాలనీకి చెందిన రాజేష్, గాయపడిన తేజస్వినిది ప్రేమ వివాహమన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోగా, అడ్డు వచ్చిన లక్ష్మీనారాయణకు గాయాలయ్యాయన్నారు.

News April 14, 2026

చంద్రబాబు, స్టాలిన్, సిద్దరామయ్యకు రేవంత్ లేఖ

image

దక్షిణాది రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, స్టాలిన్, సిద్దరామయ్యకు తెలంగాణ సీఎం రేవంత్ లేఖ రాశారు. నియోజకవర్గాల పెంపుపై కలిసి పోరాడుదామని కోరారు. కేంద్రం చర్యల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు <<19651062>>అన్యాయం<<>> జరుగుతోందన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని సూచించారు. నియోజకవర్గాల పెంపులో హైబ్రిడ్ మోడల్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.

News April 14, 2026

గ్రాము బంగారానికి ₹11వేల లాభం!

image

2019 OCT 15న ఇష్యూ అయిన సిరీస్-5 సావరిన్ గోల్డ్ బాండ్ల ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ రేపటి నుంచి చేసుకోవచ్చని RBI ప్రకటించింది. అప్పుడు గ్రాము ధర ₹3,738 ఉంటే ఇప్పుడు ₹15,009కు (₹11,271 లాభం) చేరింది. ఏప్రిల్ 9, 10, 13 తేదీల్లో గోల్డ్ ప్రైస్ యావరేజ్ ఆధారంగా RBI దీనిని డిసైడ్ చేసింది. మొత్తంగా 302% ప్రాఫిట్.. అంటే ₹లక్ష పెట్టిన వారికి ₹4లక్షలు వస్తాయి. ఇది కాక ఏటా ఇచ్చే 2.5% వడ్డీ కూడా యాడ్ అవుతుంది.