News April 24, 2025
భూ సమస్యల పరిష్కారానికే భూభారతి చట్టం: కలెక్టర్

భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టంలో ప్రవేశపెట్టిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం బీర్కూరు మండల కేంద్రంలో భూభారతి చట్టం అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఆలోచించి ధరణిలోని సమస్యలను పరిష్కరించి భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ సదస్సులో రెవెన్యూ అధికారులతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 24, 2025
KMR: భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులు: కలెక్టర్

భూ భారతి చట్టంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత చర్యలు చేపట్టింది. ఈ మేరకు KMR జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. గురువారం బీర్కూర్, నసురుల్లాబాద్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. భూమికి సంబంధించిన కొత్త చట్టంపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయడమే ఈ సదస్సుల ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.
News April 24, 2025
NLG: రిసోర్స్ పర్సన్స్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు మండల, జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్ల కోసం అర్హత, ఆసక్తిగల ఉపాధ్యాయులు ఈ నెల 24న దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ భిక్షపతి తెలిపారు. ఎంపికైన వారి వివరాలు ఈ నెల 28న ప్రకటిస్తామని పేర్కొన్నారు. వివరాలకు క్వాలిటీ కోఆర్డినేటర్ ఆర్.రామచంద్రయ్యను, సెల్ నంబర్ 79955 67558ను సంప్రదించాలని సూచించారు.
News April 24, 2025
విశాఖను అమ్మేస్తున్నారు: కేశినేని నాని

ఉర్సా క్లస్టర్ సంస్థలకు భూకేటాయింపులపై విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తాను చేసిన విమర్శలను సమర్ధించుకున్నారు. ఎవరు ఎన్ని జూమ్ మీటింగులు పెట్టి వివరణలు ఇచ్చినా “Vizag is for sale” అంటూ గురువారం నాని ట్వీట్ చేశారు. తనను ఎన్ని బూతులు తిట్టినా, చిప్ పోయిందని, సైకో అన్నా తనకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదని.. విశాఖలో ఇటీవల జరిపిన భూకేటాయింపులు సక్రమంగా లేవని నాని ఆరోపించారు.