News August 19, 2025

భైరవకోనకు వెళ్తున్నామని.. మృత్యువు ఒడిలోకి

image

కనిగిరి మండలం పునుగోడు చెరువులో మంగళవారం మృతి చెందిన ఇద్దరు యువకుల వివరాలు, ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. ఎస్సై శ్రీరామ్ వివరాల మేరకు.. కనిగిరి మున్సిపల్ పరిధిలోని శంకవరం గ్రామానికి చెందిన ఎన్నింటి గౌతమ్ (17), కనిగిరి నక్కల తిప్పకు చెందిన బొందలపాటి శివప్రసాద్(19)గా గుర్తించారు. వీరిద్దరూ ఈనెల 17న భైరవకోనకు వెళ్తున్నామని ఇంట్లో చెప్పి బయటకు వచ్చారు. ఈ క్రమంలో వారు మృత్యువాత పడ్డారు.

Similar News

News August 19, 2025

ఉద్యానవన పంటల సాగుపై చైతన్య పరచాలి: కలెక్టర్

image

జిల్లాలో ఉద్యానవన పంటల సాగుకు సంబంధిత అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. మంగళవారం ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులతో ఆమె సమీక్షించారు. ఉద్యానవన పంటలకు అనుకూలమైన భూములను గుర్తించాలన్నారు. రైతులను ప్రోత్సహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు.

News August 19, 2025

‘పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు చేపట్టాలి’

image

జిల్లాలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జేసీ గోపాలకృష్ణ అన్నారు. విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జేసీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన రీ సర్వే ప్రక్రియ, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడారు.

News August 19, 2025

నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలి: కలెక్టర్

image

జిల్లాలో 10వ తరగతి విద్యార్హత ఉన్నవారు కనీసం 10 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు కృషి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులకు ఉల్లాస్ అక్షర ఆంధ్ర అక్షరాస్యత కార్యక్రమంపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న వారిని అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యమన్నారు.