News March 20, 2025

భైoసా: ఆల్ ఇండియా పోటీలకు తపాలా ఉద్యోగులు

image

ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే క్రీడల్లో సత్తాచాటి జాతీయస్థాయికి ఎంపికయ్యారు జిల్లాకు చెందిన తపాలా ఉద్యోగులు వినోద్ కుమార్, నరేశ్‌కుమార్. HYDలో జరిగిన జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబర్చి అల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలో జరిగే పోటీల్లో వీరు RSB HYD జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. అక్కడ కూడా ప్రతిభ చాటాలంటే ఆల్ ది బెస్ట్ చెప్పేయండి మరి. 

Similar News

News March 20, 2025

రాష్ట్రంలో పెరిగిన బాలికల జననాలు

image

AP: రాష్ట్రంలో బాలికల జననాలు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. 2023-24లో ప్రతి వెయ్యి మంది బాలురకు 944 మంది బాలికల జననాలు నమోదయ్యాయి. 2014-15లో ఇది 1000:921గా ఉండేది. మరోవైపు జాతీయస్థాయిలో 2023-24లో ఇదే నిష్పత్తి 1000:930గా ఉంది. గోవా, అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో 2023-24లో బాలికల జననాలు అధికంగా ఉండగా.. లక్షద్వీప్, అండమాన్ నికోబార్, బిహార్‌లో తక్కువగా నమోదయ్యాయి.

News March 20, 2025

ఈ సినిమాలోనూ ‘గజిని’ లాంటి సర్‌ప్రైజ్: మురుగదాస్

image

గజిని చిత్రంలో మాదిరే ‘సికందర్’ సినిమాలోనూ సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుందని దర్శకుడు మురుగదాస్ చెప్పారు. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయని పేర్కొన్నారు. కాగా సల్మాన్‌కు హత్యా బెదిరింపుల నేపథ్యంలో షూటింగ్ సమయంలో అందరినీ చెక్ చేసేందుకు 2-3 గంటల సమయం పట్టేదని పేర్కొన్నారు. కాగా ఈ మూవీ ఈ నెల 30న రిలీజ్ కానుంది.

News March 20, 2025

రాజ్‌భవన్ రోడ్డులోని ATMలో పాడు పని!

image

ATMలో ఓ వ్యక్తి చేసిన పాడు పని ఆలస్యంగా వెలుగుచూసింది. పంజాగుట్ట PS పరిధి రాజ్‌భవన్‌ రోడ్డు RBL ATM పనిచేయడం లేదని సిబ్బంది తనిఖీ చేశారు. సెన్సార్ పనిచేయడం లేదని గుర్తించి, సీసీ టీవీ పరిశీలించగా కంగుతిన్నారు. ఈ నెల 10వ తేదీన రాత్రి ఓ యువకుడు డబ్బులు డ్రా చేశాడు. అనంతరం ATM మిషన్ పక్కనే మూత్రవిసర్జన చేశాడు. దీనిపై పోలీసులకు దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!