News March 18, 2025
భోగాపురంలో బాంబు పేలి కార్మికుడి మృతి

భోగాపురంలో రాళ్లను పేల్చేందుకు ఏర్పాటు చేసిన బాంబు పేలి కార్మికుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం సోమవారం జరిగింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల్లో భాగంగా రహదారి ఏర్పాటుకు అడ్డంగా ఉన్న బండరాళ్లను తొలగించే క్రమంలో బాంబులు పెడుతుండగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రామచంద్రపేటకు చెందిన కార్మికుడు కొత్తయ్య మృతి చెందాడు.
Similar News
News March 18, 2025
VZM: కరెంట్ షాక్తో యువకుడి మృతి

విజయనగరం జిల్లా బాడంగి మండలంలో కరెంట్ షాక్తో యువకుడు మృతి చెందాడు. వేపాడ మండలం డబ్బిరాజు పేటకు చెందిన రామ్కుమార్ బొత్సవాని పాలెంలోని బెల్లం క్రషర్ వద్ద పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం సామగ్రిని వ్యాన్లోకి ఎక్కిస్తుండగా విద్యుత్ వైర్లు తగిలాయి. ఈ ప్రమాదంలో రామ్కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బాడంగి సీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
News March 18, 2025
విజయనగరం: మహిళలు శక్తి యాప్ను తప్పనిసరిగా వాడాలి

రాష్ట్రంలోని మహిళల భద్రత కోసం ఏర్పాటుచేసిన శక్తి యాప్ ప్రతి ఒక్క మహిళలు తమ ఆండ్రాయిడ్ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ..శక్తి యాప్ మహిళల నివాసం, కార్యాలయం, ప్రయాణంలో రక్షణ కల్పించేలా రూపొందించింది పడిందని, ఈ యాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ మహిళలకు భద్రత కొత్తదారులు తెరుచుకున్నాయని, గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
News March 18, 2025
VZM: వినతులను పరిష్కరించి తెలుగులోనే సమాచారం ఇవ్వాలి

ప్రజా వినతుల పరిష్కార వేదికలో వివిధ వర్గాలు ఇచ్చే వినతులను పరిష్కరించిన అనంతరం తెలుగులో వారికి అర్ధమయ్యే రీతిలో సమాచారం ఇవ్వాలని కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ ఆయా డివిజన్ల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. వచ్చిన ప్రతి వినతిని పరిష్కరించిన తర్వాత ఆయా వినతులు అందించిన వారితో మాట్లాడి వారు ఇచ్చిన వినతులను పరిష్కరించాలన్నారు.