News January 13, 2026

భోగి పండుగ రోజున పిల్లలు రేగు పళ్లు ఎందుకు తినాలి?

image

రేగుపండ్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. పిల్లల్లో వచ్చే జలుబు, దగ్గుల నుంచి రక్షణనిస్తాయి. మెదడును ప్రశాంతంగా ఉంచి, చిన్నారులలో ఏకాగ్రతను, చలాకీతనాన్ని పెంపొందిస్తాయి. వీటిలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎముకలను దృఢమవుతాయి. రక్తాన్ని శుద్ధి చేసి చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. అందుకే భోగి పళ్లు కేవలం సంప్రదాయమే కాదు! పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడే ఆరోగ్య ప్రదాయిని.

Similar News

News February 21, 2026

రాష్ట్రంలో 250 పోస్టులకు నోటిఫికేషన్

image

<>ట్రాన్స్‌మిషన్ <<>>కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ 250 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE/BTech(EEE, ECE, CSE, మెకానికల్, సివిల్, IT), డిప్లొమా ఉత్తీర్ణులు NATS పోర్టల్‌లో FEB 26 వరకు ఎన్‌రోల్ చేసుకోవాలి. TG ట్రాన్స్‌కోలో FEB 27వరకు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్లకు నెలకు స్టైపెండ్ రూ.17,500, డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.15000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: tgtransco.com

News February 21, 2026

ఏఐ సమ్మిట్‌పై జగన్ నకిలీ సానుభూతి: లోకేశ్

image

AP: AI సమ్మిట్‌లో కాంగ్రెస్ నేతల నిరసనలను <<19201240>>ఖండించిన<<>> YCP చీఫ్ జగన్‌కు మంత్రి లోకేశ్ కౌంటరిచ్చారు. ‘2017లో ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌కు అంతరాయం కలిగించడానికి ఎయిర్‌పోర్టులో ధర్నా చేశారు. 2019లో గ్లోబల్ ఇన్వెస్టర్లతో విద్యుత్ ఒప్పందాలను, 2020లో అమరావతి-సింగపూర్ ఒప్పందాన్ని రద్దు చేశారు. 2025లో రుణాలు రాకుండా RBIకి లేఖ రాశారు. ఇప్పుడు AI సమ్మిట్‌పై నకిలీ సానుభూతి ప్రదర్శిస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.

News February 21, 2026

వాసుదేవరెడ్డికి ఈ నెల 27 వరకు రిమాండ్

image

AP: లిక్కర్ స్కామ్ కేసు నిందితుడు <<19203084>>వాసుదేవరెడ్డికి<<>> విజయవాడ ACB కోర్టు ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను గుంటూరు జైలుకు తరలించనున్నారు. అంతకుముందు కోర్టులో విచారణ సందర్భంగా సిట్ విచారణకు వాసుదేవరెడ్డి సహకరిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. అప్రూవర్‌గా మారారని, అత్యవసరంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని వాదించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉందని చెప్పారు.