News January 13, 2026
భోగి పండుగ రోజున పిల్లలు రేగు పళ్లు ఎందుకు తినాలి?

రేగుపండ్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. పిల్లల్లో వచ్చే జలుబు, దగ్గుల నుంచి రక్షణనిస్తాయి. మెదడును ప్రశాంతంగా ఉంచి, చిన్నారులలో ఏకాగ్రతను, చలాకీతనాన్ని పెంపొందిస్తాయి. వీటిలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎముకలను దృఢమవుతాయి. రక్తాన్ని శుద్ధి చేసి చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. అందుకే భోగి పళ్లు కేవలం సంప్రదాయమే కాదు! పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడే ఆరోగ్య ప్రదాయిని.
Similar News
News February 21, 2026
రాష్ట్రంలో 250 పోస్టులకు నోటిఫికేషన్

<
News February 21, 2026
ఏఐ సమ్మిట్పై జగన్ నకిలీ సానుభూతి: లోకేశ్

AP: AI సమ్మిట్లో కాంగ్రెస్ నేతల నిరసనలను <<19201240>>ఖండించిన<<>> YCP చీఫ్ జగన్కు మంత్రి లోకేశ్ కౌంటరిచ్చారు. ‘2017లో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కు అంతరాయం కలిగించడానికి ఎయిర్పోర్టులో ధర్నా చేశారు. 2019లో గ్లోబల్ ఇన్వెస్టర్లతో విద్యుత్ ఒప్పందాలను, 2020లో అమరావతి-సింగపూర్ ఒప్పందాన్ని రద్దు చేశారు. 2025లో రుణాలు రాకుండా RBIకి లేఖ రాశారు. ఇప్పుడు AI సమ్మిట్పై నకిలీ సానుభూతి ప్రదర్శిస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.
News February 21, 2026
వాసుదేవరెడ్డికి ఈ నెల 27 వరకు రిమాండ్

AP: లిక్కర్ స్కామ్ కేసు నిందితుడు <<19203084>>వాసుదేవరెడ్డికి<<>> విజయవాడ ACB కోర్టు ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను గుంటూరు జైలుకు తరలించనున్నారు. అంతకుముందు కోర్టులో విచారణ సందర్భంగా సిట్ విచారణకు వాసుదేవరెడ్డి సహకరిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. అప్రూవర్గా మారారని, అత్యవసరంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని వాదించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉందని చెప్పారు.


