News October 7, 2025

మంగపేటకు బస్సు ఎప్పుడు వచ్చిందో తెలుసా?

image

ములుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమైన మంగపేట గ్రామానికి 1977లో బస్సు సౌకర్యం ఏర్పాటయింది. అప్పటి MLA సంతోశ్ చక్రవర్తి ఏజెన్సీ ప్రజల రవాణా ఇబ్బందులను గుర్తించి బస్సును ఏర్పాటు చేయించారు. వరంగల్ డిపోకు చెందిన బస్సును RTC అధికారులు మంగపేటకు కేటాయించారు. ఏజెన్సీ ఏరియాకు మొదటిసారిగా బస్సు రావడంతో నాటి ప్రజలకు ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.

Similar News

News October 7, 2025

HYD: బీజేపీ గుప్పిట్లో ‘కీలకమైన ఏడుగురు’..?

image

జూబ్లీహిల్స్‌ బైపోల్‌లో వీవీఐపీ మధ్య యుద్ధానికి తెరపడనుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీబీజేపీ చీఫ్ ఎన్.రామచందర్‌రావు వద్ద ఉన్న కీలక జాబితాల నుంచి ఏడుగురు బలమైన అభ్యర్థులను బీజేపీ వడపోసినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ సీటును పార్టీ ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుందో చెప్పడానికి, అభ్యర్థిని ఎంపిక చేయడానికి ఏకంగా ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయడమే నిదర్శనం.

News October 7, 2025

పైడితల్లి అమ్మవారి దివ్యగాథ

image

విజయనగరానికి రాజైన తన సోదరుడు విజయరామరాజును బొబ్బిలి యుద్ధానికి వెళ్లొద్దని పైడితల్లమ్మ ముందే చెబుతారు. కానీ ఆమె మాట వినక రాజు యుద్ధానికెళ్లి మరణిస్తాడు. ఈ కబురు తెలిసి అమ్మవారు కూడా తనువు చాలిస్తారు. అదే రాత్రి పతివాడ అప్పలనాయుడు కలలోకి వచ్చిన అమ్మవారు తన ప్రతిరూపాలు లభించే స్థలాన్ని సూచిస్తారు. వాటిని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించమని చెబుతారు. ఆ విగ్రహాలు నిజంగానే లభ్యమవ్వగా, ఆలయాన్ని నిర్మించారు.

News October 7, 2025

HYD: బీజేపీ గుప్పిట్లో ‘కీలకమైన ఏడుగురు’..?

image

జూబ్లీహిల్స్‌ బైపోల్‌లో వీవీఐపీ మధ్య యుద్ధానికి తెరపడనుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీబీజేపీ చీఫ్ ఎన్.రామచందర్‌రావు వద్ద ఉన్న కీలక జాబితాల నుంచి ఏడుగురు బలమైన అభ్యర్థులను బీజేపీ వడపోసినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ సీటును పార్టీ ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుందో చెప్పడానికి, అభ్యర్థిని ఎంపిక చేయడానికి ఏకంగా ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయడమే నిదర్శనం.