News August 5, 2025

మంగళగిరిలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

image

చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న మంగళగిరి ఆటోనగర్ లోని వీవర్ శాల వద్ద జరిగే జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. మంగళవారం, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ పర్యవేక్షణలో ముఖ్యమంత్రి కార్యక్రమాల కో ఆర్డినేటర్, శాసనమండలి సభ్యుడు పెందుర్తి వెంకటేశ్వరరావు, సీఎం పర్యటనకు సంబంధించి పనులను పరిశీలించారు. చేనేత కుటుంబాలతో సమావేశమయ్యే ప్రదేశంలో పలు సూచనలు చేశారు.

Similar News

News November 5, 2025

సిక్కుల ఆరాధ్య దైవం మన గుంటూరు వచ్చారని తెలుసా?

image

గుంటూరు జిల్లాలో సిక్కుల ఆరాధ్య దైవం గురునానక్‌ సందర్శించిన ప్రదేశంగా ‘గురుద్వారా పెహ్లీ పాట్షాహీ’ గుర్తింపు పొందింది. రెండవ ఉదాసి (1506–1513) కాలంలో గురునానక్‌ దక్షిణ భారత పర్యటనలో గుంటూరును సందర్శించినట్లు ఆధారాలు చెబుతున్నాయి. ఆయన ప్రసంగాలతో ప్రభావితమై ఏర్పడిన ఈ గురుద్వారా ఆధ్యాత్మిక చరిత్రలో ముఖ్య స్థావరంగా నిలిచింది. 19వ శతాబ్దంలో తీర్థయాత్రికులు ఈ ప్రాంతాన్ని తిరిగి అభివృద్ధి చేశారు.

News November 5, 2025

మేడికొండూరు: అదును చూసి.. భారీ చోరీ

image

మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో మంగళవారం దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన ఆమతి వీరయ్య దీక్షలో ఉండి ఇంటికి తాళం వేసి బయట ఉండగా, దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. వారు బీరువా పగలగొట్టి సుమారు రూ.10 లక్షల విలువైన 86 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.40 వేల నగదును దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 4, 2025

అమరావతి విజన్ రూపకల్పనలో భాగస్వామ్యం కావాలని CRDA పిలుపు

image

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవిష్యత్తు విజన్ రూపకల్పనలో మీరు కూడా భాగస్వాములవ్వాలని CRDA కోరుతుంది. అభిప్రాయాన్ని నమోదు చేసేందుకు ఈ లింక్‌ను క్లిక్ చేసి లేదా QR కోడ్‌ను స్కాన్ చేయాలని లింక్ https://tinyurl.com/4razy6ku రూపొందించింది. అమరావతి ప్రాంత అభివృద్ధికి విజన్ 2047 రూపొందించడంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చింది.