News April 18, 2025

మంగళగిరిలో ప్రజాదర్బార్ నిర్వహించిన హోం మంత్రి 

image

హోంమంత్రి వంగలపూడి అనిత మంగళగిరి టీడీపీ ఆఫీసులో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్‌లో ప్రజలు తమ సమస్యలను చెప్పుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలు తెలుపుకున్నారు. భూసమస్యలు, పిల్లల విద్యకు సంబంధించి, చెరువుకు సంబంధించిన సమస్యలను అర్జీదారులు హోంమంత్రి వద్ద మొరపెట్టుకున్నారు. ఈ సమస్యలన్నిటినీ వెంటనే పరిష్కరించాలని హోం మంత్రి అధికారులను ఆదేశించారు.

Similar News

News April 20, 2025

40,132 మందికి గ్యాస్ సబ్సిడీ విడుదల: జేసీ 

image

రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీని 40,132 మంది లబ్దిదారులకు విడుదల చేశామని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తెలిపారు. వారిలో 26,651 లబ్దిదారులకు రూ.2,11,06,884 బ్యాంకు అకౌంట్లలో జమైందన్నారు. మిగతావారికి త్వరలో సబ్సిడీ మొత్తం జమవుతుందని తెలిపారు. గ్యాస్ ఏజెన్సీలు ఎటువంటి అవకతవకలకు పాల్పడరాదని హెచ్చరించారు.

News April 19, 2025

పోర్టు పరిసర ప్రాంతాల యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ

image

పోర్టు పరిసర ప్రాంతాల యువతకు ప్రోడక్ట్ డిజైన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రీషియన్, C.N.C. ఆపరేటర్, C.N.C. ప్రోగ్రామర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు C.E.M.S. ప్రోగ్రాం మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ హెడ్ ప్రజిత్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం పోర్టు, C.E.M.S. సంయుక్తంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో ఈ శిక్షణ ఏర్పాటు చేశారన్నారు. అనంతరం వారికి ఉపాధి కల్పిస్తామన్నారు. 

News April 19, 2025

విశాఖ నగర అభివృద్ధిలో భాగస్వామ్యం.. నా అదృష్టం: మేయర్

image

జీవీఎంసీలో నాలుగు వసంతాలపాటు మేయర్‌గా పదవిని బాధ్యతతో నిర్వర్తించినందుకు చాలా సంతృప్తినిచ్చిందని విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి శనివారం ద్వారా తెలిపారు. పార్టీలకు అతీతంగా ఈ నాలుగు సంవత్సరాలలో ఎంతో జఠిలమైన సమస్యలను పరిష్కరించామన్నారు. తనకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి కార్పొరేటర్‌కు వారి వార్డులో నిధులు కేటాయింపులో ఎటువంటి వివక్షతను చూపలేదన్నారు.

error: Content is protected !!