News January 4, 2026
మంగళగిరిలో యవకుల హల్చల్.. యువతి అపహరణ

మంగళగిరిలో ఇంట్లో ఉన్న ఓ ఇంటర్ విద్యార్థినిని (16) కొందరు యువకులు బలవంతంగా అపహరించుకుపోయిన ఘటన కలకలం రేపింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు ఇంట్లోకి చొరబడి విద్యార్థినిని లాక్కెళ్తుండగా, అడ్డువచ్చిన తమపై కూడా దౌర్జన్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Similar News
News February 21, 2026
GNT: శనగ రైతులకు జాయింట్ కలెక్టర్ సూచన

జిల్లాలో శనగ కొనుగోలు ప్రక్రియ ప్రారంభించినట్లు JC అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. రబీ 2025-26లో శనగ సాగు చేసిన రైతులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ. 5,875 ప్రకటించిందని తెలిపారు. జిల్లాలో 9 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి కొనుగోలు చేస్తామన్నారు. 13 మండలాల్లో సుమారు 16,600 హెక్టార్లలో శనగ పంట సాగు చేయగా, 45 వేలమెట్రిక్ టన్నుల అంచనా ఉందన్నారు.
News February 21, 2026
GNT: మెడికల్ ఎగ్జిబిషన్.. ఈ నెల 28 వరకు పొడిగింపు

గుంటూరు మెడికల్ కాలేజీలో 30 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న మెడికల్ ఎగ్జిబిషన్ను ప్రజల విజ్ఞప్తితో ఫిబ్రవరి 28 వరకు పొడిగించారు. ఇకపై మరింత గడువు లేదని ప్రిన్సిపల్ డా. సుందరాచారి స్పష్టం చేశారు. వేలాది మంది ఇప్పటికే సందర్శించారు. ఎండల దృష్ట్యా తాగునీరు, శౌచాలయాల వంటి సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. విదేశీ యువతి ప్రదర్శనను ఆసక్తిగా వీక్షించడం ఆకట్టుకుంది.
News February 21, 2026
GNT: విభిన్న ప్రతిభావంతులకు ముఖ్య గమనిక

గుంటూరు జిల్లాలో 3 చక్రాల స్కూటర్ల కోసం దరఖాస్తు చేసుకున్న శారీరక విభిన్న ప్రతిభావంతుల ధృవపత్రాల పరిశీలన ఈ నెల 25న జరగనుంది. బృందావన్ గార్డెన్స్ 1వ లైనులో ఉదయం 10గంటల నుంచి ఎంపిక కమిటీ ద్వారా ధృవపత్రాల పరిశీలన జరుగుతుందని విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాలు, వయోవృద్దుల సంక్షేమ శాఖ సహాయసంచాలకులు N వెంకరమణప్ప తెలిపారు. దరఖాస్తు చేసుకొని ఉన్న విభిన్న ప్రతిభావంతులు ఒరిజినల్ ధృవపత్రాలతో హాజరు కావాలన్నారు.


