News March 26, 2025

మంగళగిరి రైల్వే వంతెనకు కేంద్రం ఆమోదం

image

మంగళగిరి నగరంలోని నిడమర్రు రైల్వే వంతెన నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. కేంద్ర మంత్రి పెమ్మసాని, మంత్రి లోకేశ్‌ల వినతుల మేరకు మంగళవారం ఎల్సీ 14వద్ద ఆర్వోబీనీ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సుమారు రూ.129.18 కోట్ల అంచనా వ్యయంతో.. కిలోమీటరు మేర 4 వరుసల రైల్వే వంతెన నిర్మాణం కానుంది. ఈ నిర్మాణం పూర్తి అయితే అటు రాజధానితో పాటు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ఉపయోగకరంగా ఉంటుంది.

Similar News

News September 12, 2025

ANUలో ఏపీ పీజీ సెట్ విద్యార్థులకు ఇబ్బందులు

image

ఏపీ పీజీ సెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో ఆలస్యం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసింది. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులను గురువారం పెదకాకానిలోని నాగార్జున విశ్వవిద్యాలయానికి పిలిచినా, తీరా చివరి నిమిషంలో వాయిదా వేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థులు నిరాశ చెందగా, అధికారులు కేవలం పేర్లు, హాల్ టికెట్ వివరాలు మాత్రమే నమోదు చేశారు. ఈ నిర్లక్ష్యంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

News September 11, 2025

గుంటూరు జిల్లా కలెక్టర్ నేపథ్యమిదే

image

తమీమ్ అన్సారియ IAS 2015 బ్యాచ్ ఏపీ కేడర్‌కు చెందిన డైనమిక్ ఇండియన్ IAS అధికారిణి. ఆమె డిసెంబర్ 31, 1998 న తమిళనాడులో జన్మించారు. కంప్యూటర్ సైన్స్, పబ్లిక్ మేనేజ్‌మెంట్‌లో బలమైన విద్యా నేపథ్యం ఉన్న ఆమె 2014లో 17 సంవత్సరాల వయసులో UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ 314 ర్యాంక్ సాధించారు. ఆమె భర్త డాక్టర్ మనజీర్ జీలానీ సమూన్‌ కూడా ఐఏఎస్‌ అధికారి.

News September 11, 2025

ANUలో ఈ నెల 17న క్విజ్ పోటీలు

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 17న క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రొఫెసర్ రామినేని శివరామప్రసాద్ తెలిపారు. మొదటి మూడు స్థానాలకు వరుసగా రూ.12 వేలు, రూ.9 వేలు, రూ.3 వేల నగదు బహుమతులు అందిస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు యూనివర్సిటీ అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని ఆయన కోరారు.