News October 28, 2025

మంగళవారం రాత్రికి తీరం దాటే అవకాశం: మంత్రి పార్థసారథి

image

తుఫాను సహాయక కార్యక్రమాల్లో ప్రభుత్వ ప్రతిష్ట ఇనుమడింపజేసేలా అధికార యంత్రాంగం పనిచేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి పార్థసారథి అధికారులను ఆదేశించారు. మంగళవారం నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాను మంగళవారం రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని, ఆ సమయంలో గంటకు 110 కి.మీ. వేగంతో గాలులు, భారీ వర్షాలు కురుస్తాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

Similar News

News October 29, 2025

సంగారెడ్డి: ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ

image

సంగారెడ్డిలోని స్టేట్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో 30 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని డైరెక్టర్ రాజేశ్ కుమార్ తెలిపారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 19 నుంచి 45 వయసు గల పురుష అభ్యర్థులు అర్హులు. 10 క్లాస్ పాసై, తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలి. శిక్షణ సమయంలో వసతి భోజనం ఉచితంగా ఇస్తామన్నారు.

News October 29, 2025

అంగన్‌వాడీల్లో 14వేల పోస్టులు.. మంత్రి కీలక ఆదేశాలు

image

TG: అంగన్‌వాడీల్లో 14K పోస్టుల నియామకానికి చర్యలు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఏజెన్సీలో STలకు 100% కోటాపై సుప్రీంకోర్టు స్టే ఎత్తివేతకు వెకేట్ పిటిషన్ వేయాలన్నారు. KA, AP, ఛత్తీస్‌గఢ్‌లో అంగన్వాడీ పోస్టులను ప్రభుత్వ సర్వీస్‌గా పరిగణించకపోవడంతో 50% రిజర్వేషన్ రూల్ వర్తించట్లేదని అధికారులు మంత్రికి వివరించారు. దీంతో ఇక్కడా అదే విధానాన్ని అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు.

News October 29, 2025

కావలిలో భారీ వర్షపాతం నమోదు

image

నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు తెలియజేశారు. కావలి 21.2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. దగదర్తిలో 17.7, ఉలవపాడులో 16.2, జలదంకిలో 16.1, కందుకూరులో 15.3, కొడవలూరులో 14.6, కలిగిరిలో 13.8, లింగసముద్రంలో 13.1 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదు అయ్యింది.