News March 21, 2025
మంచినీటి సమస్యాత్మక గ్రామాలను గుర్తించాలి: కలెక్టర్

జిల్లాలో వారంలోగా మంచినీటి సమస్యాత్మక గ్రామాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. గురువారం వేసవిలో తాగునీటి సరఫరా, జల్ జీవన్ మిషన్ పథకాల అమలుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. సంబంధిత శాఖల అధికారులందరూ సమన్వయంతో ఆయా గ్రామాలలో తాగునీటి సమస్య రాకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలన్నారు. మండలస్థాయి అధికారులు తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
Similar News
News December 24, 2025
H.జంక్షన్లో మహిళ అనుమానాస్పద మృతి

H.జంక్షన్ లోని పశువుల సంత ఎదురుగా ఉన్న 3 అంతస్తుల భవనంలో నివసిస్తున్న ఓ మహిళ బుధవారం అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతురాలి ముఖానికి కవర్లు కట్టి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలే ఘటనకు కారణమై ఉండొచ్చని చర్చ సాగుతోంది. మహిళ విజయనగరం, భర్త తిరువూరుకు చెందినవారు. ఘటన స్థలానికి క్లూస్ టీం, పెదపాడు పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 24, 2025
చిక్కడపల్లిలో బాయ్ఫ్రెండ్తో కలిసి డ్రగ్స్ అమ్మిన యువతి అరెస్ట్

చిక్కడపల్లిలో డ్రగ్ నెట్వర్క్ గుట్టును పోలీసులు బయటపెట్టారు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్గా పనిచేస్తున్న సుష్మిత తన బాయ్ఫ్రెండ్ ఇమాన్యుల్తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి MDMA డ్రగ్స్, LSD బాటిల్స్, ఓజీ కుష్ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుంది.
News December 24, 2025
చిక్కడపల్లిలో బాయ్ఫ్రెండ్తో కలిసి డ్రగ్స్ అమ్మిన యువతి అరెస్ట్

చిక్కడపల్లిలో డ్రగ్ నెట్వర్క్ గుట్టును పోలీసులు బయటపెట్టారు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్గా పనిచేస్తున్న సుష్మిత తన బాయ్ఫ్రెండ్ ఇమాన్యుల్తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి MDMA డ్రగ్స్, LSD బాటిల్స్, ఓజీ కుష్ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుంది.


