News April 25, 2024
మంచినీటి సరఫరాకు ఇబ్బంది లేదు: కలెక్టర్

జిల్లాలో ప్రస్తుత వేసవిలో మంచినీటికి ఎటువంటి సమస్య తలెత్తకుండా పటిష్ఠమైన ప్రణాళిక రూపొందించుకుని అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డికి తెలిపారు. BZA నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. ప్రస్తుతం వేసవిలో ఎక్కడా తాగునీటికి ఎటువంటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News April 22, 2025
శ్రీకాకుళం: లారీ వెనుక భాగం ఢీకొని YSR విగ్రహం ధ్వంసం

రూరల్ మండలంలోని బైరి జంక్షన్లో వైఎస్ఆర్ విగ్రహం లారీ వెనుక భాగం ఢీకొనడంతో విధ్వంసానికి గురైందని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. సోమవారం నరసన్నపేట నుంచి బైరి జంక్షన్ చేరుకున్న లారీ గంగమ్మ మోడ్రన్ రైస్ మిల్కు వెళ్తూ లారీని వెనుకకు తీసే క్రమంలో విగ్రహానికి ఢీకొంది.
News April 22, 2025
శ్రీకాకుళం: బాబోయ్ అడ్మిషన్లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్..!

శ్రీకాకుళం జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్లో టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తీసుకురావాలని హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట తిరుగుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు. మీ కామెంట్?
News April 22, 2025
శ్రీకూర్మం: పుణ్యక్షేత్రంలో.. పాపం చేసింది ఎవరు..?

శ్రీకూర్మం గ్రామంలోని శ్రీ కూర్మనాధుని క్షేత్రంలో తాబేళ్లు మృతిచెందిన ఘటన సోమవారం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. తాబేళ్లను ఆలయ శ్వేతపుష్కరని సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చివేయడం ప్రజలను విస్మయానికి గురిచేసింది. పుణ్యక్షేత్రంలో పాపం చేసింది ఎవరు? తాబేళ్లు మృతిపై ఆలయ సిబ్బంది ఎందుకు గోప్యంగా ఉంచారు? దీని వెనుక కారణాలు ఏంటి.. కారకులు ఎవరు అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది.