News February 11, 2026
మంచిర్యాలలో మధ్యాహ్నం 3గంటల వరకు 58.95% పోలింగ్

జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్, నాలుగు మున్సిపాలిటీల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 58.95% పోలింగ్ జరిగింది. కార్పొరేషన్లో 54.64%, బెల్లంపల్లిలో 64.51%, చెన్నూరులో 70.02%, కేతనపల్లిలో 67.98%, లక్షెట్టిపేటలో 69.58% పోలింగ్ జరిగింది.
Similar News
News February 12, 2026
విశాఖ: ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారా?

కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో CM చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. పనితీరు మార్చుకోని వారితో నేరుగా మాట్లాడతానని CM వెల్లడించారు. మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారని అనుకుంటున్నారా కామెంట్ చేయండి.
News February 12, 2026
పోలవరం జిల్లాలో 29 PHCలకు నిధులు విడుదల

పోలవరం జిల్లాలో ఉన్న 29 PHCలకు ఒక్కో ఆసుపత్రికి రూ.2లక్షలు చొప్పున రూ.58 లక్షల నిధులను విడుదల చేసినట్లు జిల్లా వైద్యాధికారిణి డా. సరిత తెలిపారు. ఈనెల 8న నిధులు వచ్చాయన్నారు. 15 లోపు ఆసుపత్రి నిధులు ఖర్చులు ట్రెజరీకి చూపి నిధులు వినియోగించాల్సి ఉందన్నారు. వాటికి మార్గదర్శకాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
News February 12, 2026
రష్యాలో వాట్సాప్ బ్లాక్!

వాట్సాప్ను రష్యా పూర్తిగా బ్లాక్ చేయాలని ప్రయత్నిస్తోందని మెటా కంపెనీ ఆరోపించింది. వారి ఇంటర్నెట్ స్పేస్లో కంట్రోల్ కోసం సొంత యాప్స్ను ప్రమోట్ చేస్తోందని మండిపడింది. వినియోగదారులతో కనెక్ట్ అయ్యేందుకు తాము చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నామని తెలిపింది. కాగా తమ ఇంటర్నెట్ సిస్టమ్స్లో వాట్సాప్ డొమైన్స్ను రష్యా పూర్తిగా బ్లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. MAX యాప్ను ఉపయోగించాలని తమ పౌరులను కోరుతోంది.


