News March 8, 2025
మంచిర్యాలలో రైలు ఢీకొని వ్యక్తి మృతి

మంచిర్యాలలోని ఓవర్ బ్రిడ్జి సమీపంలో శుక్రవారం రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడి వయసు సుమారు 29 ఉంటుందని, తెలుపు రంగు ఫుల్ షర్ట్, బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. జీఆర్పీ ఎస్ఐ మహేందర్ ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712658596, 9849058691 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.
Similar News
News November 9, 2025
డిసెంబర్ 15న IPL వేలం!

ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్ 15న నిర్వహించే అవకాశం ఉందని TOI పేర్కొంది. గత రెండు వేలంపాటలను దుబాయ్, సౌదీ అరేబియాలో జరపగా ఈసారి ఇండియాలోనే నిర్వహించే ఛాన్స్ ఉందని తెలిపింది. కాగా రిటెన్షన్ డెడ్లైన్ ఈనెల 15న ముగియనుంది. ఈలోపు ఫ్రాంచైజీలు తాము అంటిపెట్టుకునే ప్లేయర్లను ప్రకటించాలి. అయితే CSK, RR జడేజా, శాంసన్ను ట్రేడ్ చేసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది.
News November 9, 2025
లిల్లీ పూల సాగు – అనువైన రకాలు

☛ సెమి-డబుల్ రకాలు: వీటిలో పూల రేకులు 2-3 వరుసలలో అమరి ఉంటాయి. ఉదా: CV. సెమీ-డబుల్.
☛ డబుల్ లిల్లీ రకాలు: ఈ పూల రేకులు 3 కన్నా ఎక్కువ వరుసలలో అమరి ఉంటాయి.
☛ ఉదా: సువాసిని, స్వర్ణ రేఖ, హైదరాబాద్ డబుల్, కలకత్తా డబుల్, వైభవ్, పెర్ల్ డబుల్. ఈ రకాలను ఎక్కువగా బొకేల తయారీలో వాడతారు. ☛ రైతులు ఏ ఉద్దేశంతో వీటిని సాగు చేయాలనుకుంటున్నారో అందుకు అనువైన రకాన్ని వ్యవసాయ నిపుణుల సూచనలతో ఎన్నుకోవడం మంచిది.
News November 9, 2025
NZB: లాడ్జిలో వ్యభిచారం.. ఇద్దరి అరెస్ట్

లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు 1 టౌన్ SHO రఘుపతి తెలిపారు. నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో లక్ష్మీ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు శనివారం రాత్రి దాడి చేశారు. లాడ్జి నిర్వాహకులు సాయిలు, రాజును అరెస్టు చేశారు. మరో ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


