News November 13, 2024

మంచిర్యాలలో 7వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

image

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జాఫర్ నగర్‌కు చెందిన 7వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు SI సనత్ తెలిపారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న రమీనా హుస్సేన్ సోమవారం పాఠశాల నుంచి వచ్చి ఇంట్లోకు వెళ్లి గడియ పెట్టుకుంది. ఎంత సేపటికి రాకపోవడంతో కుటుంబీకులు తలుపులు పగలగొట్టి చూడగా బాలిక ఇంట్లో ఉరేసుకొని ఉన్నట్లు వెల్లడించారు. కాగా ఈ ఘటనపై SI కేసు నమోదు చేశారు.

Similar News

News February 28, 2026

ADB జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్: SP

image

మార్చి ఒకటి నుంచి 31 వరకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. డీఎస్పి లేదా ఆ పై స్థాయి అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించరాదని అన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

News February 28, 2026

ADB: బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం

image

రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. కామారెడ్డి MLA రమణా రెడ్డి నివాసంలో జరిగిన ఈ భేటీకి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు, ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు సిద్ధం కావాలని సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పాయల్ శంకర్, MLC అంజి రెడ్డి, MLAలు హరీష్ బాబు, రామారావు పాటిల్ పాల్గొన్నారు.

News February 28, 2026

ఆదిలాబాద్: ఇంగ్లిష్ పరీక్షకు 364 మంది గైర్హాజరు

image

జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. శనివారం నిర్వహించిన ఆంగ్ల పరీక్ష సజావుగా ముగిసిందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (DIEO) జాదవ్ గణేష్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 8,622 మంది విద్యార్థులకు గాను 8,258 మంది పరీక్షకు హాజరయ్యారని, 364 మంది గైర్హాజరైనట్లు వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.