News April 2, 2024
మంచిర్యాల: ఆల్ టైం రికార్డ్ సాధించిన సింగరేణి

సింగరేణి సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం సాధించి ఆల్ టైం రికార్డ్ ఆర్థిక సంవత్సరానికి బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 70.02 మిలియన్ టన్నులు సాధించడంతోపాటు అదే స్థాయిలో 69.86లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ సంస్థ C&MD బలరాం నాయక్ ను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థవంతమైన అధికారిని నియమించారన్నారు.
Similar News
News July 7, 2025
ఆదిలాబాద్: కంట్లో కారం చల్లి, బండరాళ్లతో కొట్టి హత్య

లక్ష్మిపూర్ అటవీ ప్రాంతంలో <<16964169>>మహిళ <<>>మృతదేహం ఆదివారం లభ్యమైన విషయం తెలిసిందే. ఇంద్రవెల్లి(M) నర్సాపూర్ వాసి వందన(45), ADB వాసి శంకర్ను పెళ్లిచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఎలాగైనా చంపాలని భావించి ఈనెల 2న లక్ష్మిపూర్ అటవీ ప్రాంతానికి తీసుకుని వెళ్లాడు. కంట్లో కారం చల్లి, తలపై బండరాళ్లతో కొట్టి హత్యచేశాడు. తండ్రిపై అనుమానంతో కూతురు PSలో ఫిర్యాదు చేయగా హత్య చేసినట్లు శంకర్ అంగీకరించాడు.
News July 6, 2025
సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి: ADB SP

సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సైబర్ నేరాలకు గురైన
వారు 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాల బారిన పడిన గంటలోపు ఫిర్యాదు చేస్తే ఆర్థిక నష్టం జరిగిన వాటిని తిరిగి రప్పించే అవకాశం ఉంటుందన్నారు. గతవారం జిల్లాలో దాదాపు సైబర్ నేరాలపై 10 ఫిర్యాదులు నమోదు అయినట్లు పేర్కొన్నారు.
News July 6, 2025
ADB: యువతులను వేధిస్తున్న యువకుడిపై కేసు

యువతులు, మహిళలను వేధిస్తున్న యువకుడి పై ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. అనీస్ అనే యువకుడు స్థానిక రైల్వే స్టేషన్లో ఉన్న మహిళలు, యువతులను వేధించడంతో అతనిపై కేసు నమోదు చేశామని సీఐ కరుణాకర్ రావు తెలిపారు. సమాచారం అందుకున్న షీటీం సిబ్బంది రైల్వే స్టేషన్ చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.