News January 26, 2025

మంచిర్యాల: క్షుద్రపూజల పేరిట ఘరానా మోసం

image

మంచిర్యాల జిల్లాలో క్షుద్రపూజలు చేస్తే రూ.కోట్లలో డబ్బులు వస్తాయని మాయ మాటలు చెప్పి డబ్బులు వసూలు చేశారు. స్థానికుల వివరాల ప్రకారం.. మంచిర్యాల పట్టణానికి చెందిన ప్రభంజన్ అనే వ్యక్తికి క్షుద్ర పూజలు చేస్తే రూ.కోట్లలో డబ్బులు వస్తాయని చెప్పి మోసగాళ్లు రూ.2 లక్షలు వసూలు చేశారు. ముఠాపై అనుమానం రావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన నస్పూర్ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.

Similar News

News March 13, 2025

రామగుండం: కమిషనరేట్ పరిధిలోని SIలతో CPసమావేశం

image

రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి- మంచిర్యాల జిల్లాల పరిధిలో పనిచేస్తున్న ఎస్‌ఐలతో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కమిషనరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా CPమాట్లాడుతూ.. ఏదైనా ఘటన జరిగినప్పుడు తక్షణమే స్పందించాలని, తద్వారా విలువైన సమాచారం లభిస్తుందని అన్నారు. ఫిర్యాదుదారులకు సరైన న్యాయం చేసేందుకు కృషి చేయాలన్నారు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

News March 13, 2025

మగ, ఆడపిల్లలను సమానంగా చూడాలి: ఎస్పీ ఉదయ్

image

తల్లిదండ్రులు మన ఇంట్లోనుంచే మగ పిల్లలను, ఆడపిల్లలను సమానంగా చూడాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం మహిళా దినోత్సవం నిర్వహించారు. తల్లిదండ్రులు మగ పిల్లలకు ఇచ్చే స్వేచ్ఛను ఆడపిల్లలకు ఇస్తూ మంచి విద్యను అందించాలన్నారు. సమాజంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యమన్నారు. మహిళలు ఈ రోజుల్లో తాము ఎందులోనూ తక్కువ కాదన్న విషయాన్ని గుర్తించాలన్నారు.

News March 13, 2025

రేపు వైన్స్ బంద్

image

హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో రేపు(14న) మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షాపులు మూసివేయాలని పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రోడ్డుపై వెళ్లే వారిపై రంగులు చల్లొద్దని, గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని పోలీసులు ఆదేశించారు.

error: Content is protected !!