News December 11, 2025

మంచిర్యాల జిల్లాలో తొలి విజయం మహిళదే..!

image

హాజీపూర్ మండలం నాగారం సర్పంచ్ స్థానంపై ఉత్కంఠకు తెరపడింది. ఈరోజు జరిగిన ఎన్నికల్లో నాగారం ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఫలితాలు వెలువడగా 22 ఓట్లతో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మహేశ్వరి గెలుపొందారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ మొదలవగా ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి.

Similar News

News March 30, 2026

నేడు RR vs CSK

image

ఐపీఎల్‌లో ఈరోజు మూడో మ్యాచ్ జరగనుంది. అస్సాంలోని బర్సపారా స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. రాజస్థాన్‌కు గత ఏడాది మొదటి మూడు మ్యాచ్‌లు కెప్టెన్సీ చేపట్టిన పరాగ్ ఈసారి ఆ జట్టుకు పూర్తిగా సారథ్యం వహిస్తారు. మరోవైపు CSKకు రుతురాజ్ సారథ్యం కొనసాగిస్తారు. ఇప్పటివరకు ఈ జట్లు 31సార్లు తలపడగా CSK 16, RR 15సార్లు గెలిచింది. ఈరోజు రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది.

News March 30, 2026

నేటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

image

తిరుమలలో ఈరోజు నుంచి ఏప్రిల్ 1 వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. వసంతమండపంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ మూడురోజులూ స్వామివారిని మాడవీధుల్లో ఊరేగిస్తారు. రేపు ఉ.8-10 మధ్య స్వర్ణరథంపై శ్రీవారి తిరువీధిని చూసేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈ మూడు రోజులూ కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలతో పాటు రేపటి అష్టదళ పాద పద్మారాధన సేవను TTD రద్దు చేసింది.

News March 30, 2026

కృష్ణా జిల్లాలో 133 మందిపై బైండోవర్ కేసులు

image

కృష్ణా జిల్లాలో 133 మంది పందెం రాయుళ్లపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల కారణంగా బెట్టింగ్లను అరికట్టేందుకు గాను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. గతంలో పలు రకాల బెట్టింగ్లకు పాల్పడిన 133 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిపై బైండోవర్ కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇచ్చారు.