News December 17, 2025

మంచిర్యాల జిల్లాలో 27.15% పోలింగ్

image

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో కొనసాగుతున్న 3వ విడత పోలింగ్ ఉదయం 9గంటల వరకు 27.15శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మందమర్రిలో 34.92%, చెన్నూర్27.27%, కోటపల్లి 28.63%, జైపూర్ 23.96%, భీమారంలో 24.81%, నమోదయినట్లు అధికారులు వివరించారు. పోలింగ్ బూతుల వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లందరూ ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

Similar News

News December 21, 2025

ఎద్దు తన్నునని గుర్రంచాటున దాగినట్లు

image

ఎవరైనా ఎద్దు పొడుస్తుందని లేదా తన్నుతుందని భయపడి, దాని నుంచి రక్షణ కోసం వెళ్లి గుర్రం వెనుక దాక్కుంటే అంత కంటే పెద్ద ప్రమాదం ఉండదు. ఎందుకంటే ఎద్దు కంటే గుర్రం మరింత వేగంగా, బలంగా తన్నుతుంది. అంటే ఎవరైనా వ్యక్తి ఒక చిన్న కష్టం నుంచి బయటపడాలని చూస్తూ, తనకు తెలియకుండానే అంతకంటే భయంకరమైన చిక్కుల్లో పడినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.

News December 21, 2025

కర్నూలు: నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు.. ఐదుగురి తొలగింపు

image

తెలుగు గంగ/సోమశిల ప్రాజెక్టు నిర్వాసితుల కోటాలో నకిలీ సర్టిఫికెట్లు చూపించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన ఐదుగురిని సేవల నుంచి తొలగించారు. ఈ వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదును విచారించిన ఉప లోకాయుక్త పి.రజని ఆదేశాలతో తిరుపతిలోని ఎన్టీఆర్ తెలుగు గంగ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ తక్షణ చర్యలు చేపట్టారు. నిబంధనల ఉల్లంఘన స్పష్టంగా తేలడంతో ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు.

News December 21, 2025

కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతున్నారా?

image

అకారణంగా మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? భాగస్వామితో మనస్పర్థలున్నాయా? దీనివల్ల ప్రశాంతత కరవవుతోందా? దీనికి గ్రహ గతులు సరిగా లేకపోవడం, వాస్తు దోషాలే కారణమవ్వొచ్చు! దీని నివారణకు రోజూ ఉదయం, సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయాలి. సత్యనారాయణ స్వామి వ్రతం శుభాన్నిస్తుంది. సోమవారాలు శివాలయానికి వెళ్లడం మంచిది. అభిషేకంతో అధిక ఫలితముంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరిగి, ఇల్లు ఆనందమయంగా మారుతుంది.