News March 19, 2025
మంచిర్యాల: తల్లిదండ్రులు మందలించారని సూసైడ్

తల్లిదండ్రులు మందలించడంతో యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. SI వివరాలు.. MNCL జిల్లా శివ్వారంకి చెందిన రాకేశ్(26) ప్రైవేట్ కంపెనీలో పని చేసి మానేసి ఇంట్లోనే ఉంటున్నాడు. తల్లిదండ్రులు పని చేసుకోవాలని, పొలం పనులైనా చేయమని చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన రాకేశ్ పొలం వద్ద ఉరేసుకున్నాడు. మంగళవారం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News July 6, 2025
గిరి ప్రదక్షిణకు ట్రాఫిక్ రూల్స్-3

➥ శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి అనకాపల్లి వైపు వచ్చే ప్రైవేటు ట్రావెల్ బస్సులు, RTC బస్సులు, ఇతర వాహనదారులు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి చేరుకోవాలి.
➥ గిరిప్రదక్షిణకు వచ్చు భక్తుల రద్దీ దృష్ట్యా విశాలాక్షి నగర్ బీచ్ రోడ్ జంక్షన్ నుంచి కురుపాం బీచ్ రోడ్ జంక్షన్ వరకు వాహనములు అనుమతించరు.
➥హనుమంతువాక జంక్షన్, వెంకోజీపాలెం జంక్షన్ వద్ద భక్తుల రద్దీ ఉంటుంది.
News July 6, 2025
గిరి ప్రదక్షిణ ట్రాఫిక్ రూల్స్- 4

➣జోడుగుల్లపాలెం జంక్షన్ నుంచి హనుమంతవాక జంక్షన్ వైపునకు, హనుమంతవాక జంక్షన్ నుంచి జోడుగుల్లపాలెం జంక్షన్ వైపునకు వాహనములు అనుమతించరు. ఆ ప్రాంతీయులు విశాలాక్షినగర్ మెయిన్ రోడ్డు గుండా ప్రయాణించి SBI జంక్షన్ వద్ద జాతీయ రహదారి చేరుకోవాలి.
➣సీతమ్మధార, అల్లూరి సీతారామరాజు స్టాట్యూ నుంచి వెంకోజిపాలెం జంక్షన్ వైపు వాహనాలు అనుమతించరు.
➣వెంకోజిపాలెం జంక్షన్ నుంచి అపుఘర్ జంక్షన్ వైపు వాహనాలకు నో ఎంట్రీ.
News July 6, 2025
ఖమ్మం: కవిత పర్యటనకు బీఆర్ఎస్ నేతలు డుమ్మా.. కారణమిదేనా?

ఖమ్మం జిల్లాలో ఇటీవల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటన హాట్ టాపిక్గా మారింది. ఆమె పర్యటనలో పార్టీ కీలక నేతలు పువ్వాడ అజయ్, కందాల, సండ్ర, వద్దిరాజు రవిచంద్ర, తాత మధు ఎక్కడా కనిపించలేదు. బీఆర్ఎస్లో తనకు కేసీఆర్ తప్పా మరో లీడర్ లేరని కవిత చేసిన కామెంట్స్ వల్లే ఆపార్టీ నేతలంతా దూరంగా ఉన్నారనేది టాక్. ఆమె పర్యటనలో జిల్లా నేతలు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.