News October 30, 2025

మంచిర్యాల: ‘తెలంగాణలో ఫసల్ బీమా అమలు చేయాలి’

image

జిల్లాలోని రైతులు అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయి ఆర్థికంగా చితికిపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చివరి దశలో నష్టపోతుండటంతో కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. దీనితో ప్రతి సంవత్సరం అప్పుల పాలవుతున్నామని, తమను ఆదుకోవడానికి రాష్ట్రంలో తక్షణమే ఫసల్ బీమా యోజనను అమలు చేయాలని రైతన్నలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Similar News

News October 30, 2025

సైకిల్ ర్యాలీని ప్రారంభించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్

image

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవర్ సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఎన్.జి. కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులతో కలిసి ఆయన పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో అమరులైన పోలీసుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ వారి ఆత్మ శాంతికి ప్రార్థనలు చేశారు.

News October 30, 2025

భారీ వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

నిర్మల్ జిల్లాలో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల వల్ల ప్రాజెక్టులు అన్నీ నిండినందున, ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. అధికారులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఏ సహాయం కావాలన్నా సంప్రదించాలని కలెక్టర్ కోరారు.

News October 30, 2025

ఏలూరు: పోలీస్ ఓపెన్ హౌస్‌ను ప్రారంభించిన ఎస్పీ

image

ఏలూరులోఎస్పీ కార్యాలయ మైదానంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పోలీస్ హౌస్ ప్రారంభించామని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. పోలీసులు నిర్వహించే విధులు, వారు వినియోగించే ఆయుధాలు, వాహనాల వివరాలు, విద్యార్థి స్థాయి నుంచే తెలియజేయడం ద్వారా పోలీసు విధులు విద్యార్థులకు అవగతం అవుతాయన్నారు. పోలీసు జాగిలాలను కేసు విచారణలో ఏ విధంగా ఉపయోగపడతాయో ఆయన వివరించారు.