News November 26, 2025
మంచిర్యాల: నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలి

రాష్ట్రంలో 2వ సాధారణ పంచాయితీ ఎన్నికల నిర్వహణలో నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కార్యాలయంలో శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. నామినేషన్ ప్రక్రియ నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల పరిశీలన, పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా, ఫలితాలు వంటి ప్రతి అంశంపై అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News November 28, 2025
ప్రకృతి వ్యవసాయం.. బాపట్ల కలెక్టర్ ప్రశంసలు

అమృతలూరు మండలం గోవాడకు చెందిన మహిళా రైతు దుర్గాదేవి ప్రకృతి వ్యవసాయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సృష్టించుకున్నారు. దీంతో శుక్రవారం బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ ఆమెను ప్రశంసించారు. కేవలం 1 ఎకరం భూమిలో సహజ వ్యవసాయం చేస్తూ A-గ్రేడ్, ATM, PMDS పద్ధతులను సమర్థంగా అమలు చేస్తూ పంటల వైవిధ్యాన్ని పెంచారన్నారు. 30 రకాల విత్తనాలతో నెలకు రూ.1,21,000ల ఆదాయం అర్జిస్తూ రైతులకు ఆదర్శంగా నిలిచిందన్నారు.
News November 28, 2025
ఆదోని మండల విభజన గెజిట్ విడుదల

ఆదోని మండలాన్ని రెండు మండలాలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. ఆదోని, పెద్దహరివాణం పేర్లతో రెండు కొత్త మండలాలు ఏర్పాటయ్యాయి. ఆదోని హెడ్క్వార్టర్గా 29 గ్రామాలు, పెద్దహరివాణం హెడ్క్వార్టర్గా 17 రెవెన్యూ గ్రామాలను కలుపుతూ మండలాల పునర్విభజన చేపట్టినట్లు వివరించారు. అభ్యంతరాలు ఉంటే 30 రోజుల లోపు తెలపాలన్నారు.
News November 28, 2025
పాత ఫొటోలకు కొత్త రూపం.. ట్రై చేయండి!

పాడైపోయిన, క్లారిటీ కోల్పోయిన చిన్ననాటి ఫొటోలను HD క్వాలిటీలోకి మార్చుకోవచ్చు. ‘జెమినీ AI’ను ఉపయోగించి అస్పష్టంగా ఉన్న చిత్రాలను అప్లోడ్ చేసి, సరైన ప్రాంప్ట్తో డిజిటల్ SLR నాణ్యతకు మార్చవచ్చు. ఇది గీతలు, మసకబారడం వంటి లోపాలను సరిచేస్తూ, రూపురేఖలను చెక్కుచెదరకుండా ఉంచి, మీ జ్ఞాపకాలను సజీవంగా అందిస్తుంది. ఈ <


