News February 28, 2025

మంచిర్యాల: నేడు, రేపు తాగునీటికి సరఫరాలో అంతరాయం

image

జిల్లాలో మిషన్ భగీరథ శుద్ధి కేంద్రానికి మరమ్మతులు చేయనుడడంతో శుక్రవారం, శనివారం తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆ శాఖ ఈడీ మధుసూదన్ తెలిపారు. జిల్లాలోని దండేపల్లి, లక్షెట్టిపేట్, హాజీపూర్, మందమర్రి, జైపూర్, భీమారం, చెన్నూర్, కోటిపల్లి మండలాలకు, మంచిర్యాల, లక్షెట్టిపేట, నస్పూర్ పురపాలక సంఘాలకు రెండు రోజుల తాగునీరు నిలిపి వేస్తున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు.

Similar News

News September 17, 2025

టీనేజర్ల కోసం ChatGPTలో సెక్యూరిటీ ఫీచర్లు!

image

టీనేజర్ల భద్రత, ప్రైవసీ కోసం ChatGPTలో అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఫీచర్లను తీసుకొస్తున్నట్లు OpenAI ప్రకటించింది. యూజర్లను వయసు ఆధారంగా 2 కేటగిరీలుగా (13-17, 18+) గుర్తించేందుకు age ప్రిడిక్షన్ సిస్టమ్‌ను తీసుకురానుంది. యూజర్ ఇంటరాక్షన్‌ను బట్టి వయసును అంచనా వేయనుంది. కొన్నిసార్లు ఏజ్ వెరిఫై కోసం ID కూడా అడుగుతుందని సంస్థ తెలిపింది. సూసైడ్ వంటి సెన్సిటివ్ అంశాలపై AI స్పందించదని వివరించింది.

News September 17, 2025

రాజమండ్రి : రాష్ట్ర సమాచార కేంద్రం ఏడీగా రామచంద్రరావు

image

ఏలూరు జిల్లా పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్న ఆర్.వి.ఎస్. రామచంద్రరావు పదోన్నతిపై రాజమహేంద్రవరం రాష్ట్ర సమాచార కేంద్రం సహాయ సంచాలకుడిగా బుధవారం విధుల్లో చేరారు. ప్రస్తుతం అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎం.లక్ష్మణా చార్యులు నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఇన్‌ఛార్జి సహాయ సంచాలకుడు రామచంద్రరావుకు సిబ్బంది ఆహ్వానం పలికి అభినందనలు తెలిపారు.

News September 17, 2025

ఆదిలాబాద్: పోలీస్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం

image

ఆదిలాబాద్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. ​అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తోందన్నారు.