News March 25, 2024
మంచిర్యాల: పండగపూట విషాదం.. ఈతకు వెళ్లి యువకుడు మృతి

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దండేపల్లి మండలంలోని పాత మామిడిపల్లి గ్రామానికి గోపులాపురం కార్తీక్( 22) అనే యువకుడు గూడెం లిఫ్ట్ కాలువలో పడి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్తీక్ స్వస్థలం జన్నారం మండలం ధర్మారం గ్రామం కాగా హోలీ పండుగకు తన తాత ఇంటికి వచ్చాడు. గూడెం లిఫ్ట్ కాలువలోకి ఈతకు వెళ్లి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 21, 2026
రిమ్స్ ఎస్ఎన్సీయూ విభాగానికి జాతీయ పురస్కారం

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని శిశు సంరక్షణ కేంద్రం జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. పుదుచ్చేరిలోని జిప్మర్ సంస్థ నిర్వహించిన వర్క్షాప్లో ‘ఇన్ఫెక్షన్ కంట్రోల్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్’ ప్రాజెక్టుకు గానూ రిమ్స్ బృందం ప్రథమ బహుమతితో పాటు రూ. 5 వేల రివార్డు సాధించింది. ఈ ఘనత సాధించిన బృందాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అభినందించారు. రిమ్స్ వైద్యుల కృషి జిల్లాకు గర్వకారణమని ఆయన కొనియాడారు.
News February 21, 2026
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలే లక్ష్యం: కలెక్టర్ రాజర్షి షా

పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరీక్షల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకునేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు.
News February 20, 2026
చైల్డ్ పోర్నోగ్రఫీ.. ఆదిలాబాద్ జిల్లాలో 5 కేసులు: ఎస్పీ

చైల్డ్ పోర్న్ వీడియోలు చూడటం, డౌన్లోడ్ చేయటం, సోషల్ మీడియాలో షేర్ చేయటం చట్టరీత్యా తీవ్రమైన నేరమని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 5 కేసులు నమోదు అయ్యాయన్నారు. హైదరాబాద్ “చైల్డ్ టిప్ లైన్” పర్యవేక్షణ కొనసాగుతోందని పేర్కొన్నారు.


